Rajasthan: సొంత భవనాలు లేకుండానే 611 ప్రభుత్వ పాఠశాలలు
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా 611 ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలు లేకుండానే కొనసాగుతున్నట్లు ప్రభుత్వం శాసనసభలో వెల్లడించింది. అంతేకాకుండా పలు పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని తెలిపింది. రాష్ట్రంలో సొంత భవనాలు ఉన్న 64,484 ప్రభుత్వ పాఠశాలల్లో 2,047 స్కూళ్లలో మరుగుదొడ్ల సౌకర్యం లేదని, మరో 1,049 పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పరిస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని అధికారపక్షం విమర్శించింది. పాఠశాలల అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపింది. ఇటీవల ఝలావఢ్లోని ఓ పాఠశాలలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలపై ఆడిట్ నిర్వహించారు.
వివరాలు
కొత్త భవనాల కోసం రూ.450 కోట్ల మంజూరు
ఈ తనిఖీల్లో పాఠశాలల మౌలిక సదుపాయాల లోపాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
పాఠశాలల మరమ్మతులు, పునరుద్ధరణ కోసం రూ.550 కోట్లు, కొత్త పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.