
Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశం కొనసాగుతోంది.
ఈసమావేశంలో మొత్తం 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.33వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది.
ఈ పెట్టుబడులు సుమారు 35 వేల మందికి ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయని అంచనా.
ఎనర్జీ, టూరిజం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
ఈ ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
ఈ సమావేశానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్, వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు.
అలాగే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ SIPB సమావేశం
VIDEO | Velagapudi: 6th SIPB meeting chaired by CM Chandrababu Naidu (@ncbn ) at the Secretariat. Ministers Gottipati Ravikumar, Atchennaidu, Kandula Durgesh, Vasamsetty Subhash, CS K. Vijayanand and senior officials were present.
— Press Trust of India (@PTI_News) May 15, 2025
(Full video available on PTI Videos -… pic.twitter.com/tp4vq9gxE0