LOADING...
Srinagar-Leh highway: జోజిలా పాస్ వద్ద మంచు చరియలు విరిగిపడి.. ఏడుగురి మృతి, పలువురికి గాయాలు
జోజిలా పాస్ వద్ద మంచు చరియలు విరిగిపడి.. ఏడుగురి మృతి, పలువురికి గాయాలు

Srinagar-Leh highway: జోజిలా పాస్ వద్ద మంచు చరియలు విరిగిపడి.. ఏడుగురి మృతి, పలువురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2026
09:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

లద్దాఖ్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద భారీ విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంచు చరియలు విరిగిపడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంచు చరియల కింద పలువురు ప్రయాణిస్తున్న వాహనాలు చిక్కుకుపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే Border Roads Organisation (బీఆర్‌వో) సిబ్బంది, పోలీసు బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భారీగా పేరుకుపోయిన మంచును తొలగిస్తూ, చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. అలాగే రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు వేగవంతం చేశారు.

వివరాలు 

ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వీకే సక్సేనా

ఈ ప్రమాదంపై వీకే సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఘటన స్థలాన్ని సందర్శించి, జరుగుతున్న రక్షణ చర్యలను సమీక్షించారు. మరోవైపు, కేంద్ర మంత్రి Jitendra Singh మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నట్లు 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

Advertisement