
Ration Cards: రేషన్ జాబితా నుంచి 76,842 అనర్హుల తొలగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ పూర్తయింది. గత 6 నెలల్లో రేషన్ తీసుకోని లబ్ధిదారుల వివరాలను అధికారులు పరిశీలించగా, 76,842 మంది అనర్హులుగా గుర్తించారు. ఈ వివరాలను పౌర సరఫరాల శాఖ జిల్లా కలెక్టర్లకు పంపింది. కొద్ది రోజుల్లోనే అనర్హులను రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి, రేషన్ కోటా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Details
కేంద్రం నుంచి రాష్ట్రానికి వివరాలు
రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం ఇస్తున్నప్పటికీ, చాలామంది కనీసం 6 నెలలుగా రేషన్ తీసుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అనుమానాస్పద లబ్ధిదారుల జాబితాను రాష్ట్రానికి పంపింది. పౌర సరఫరాల శాఖ జిల్లా కలెక్టర్లకు ఈ వివరాలను అందజేయగా, మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా విచారణ జరిపించారు. అందిన నివేదికల ఆధారంగా అర్హులు, అనర్హులను గుర్తించి తుది జాబితాను పౌర సరఫరాల శాఖకు పంపారు.
Details
వలసలు, రెండు చోట్ల పేర్లు ఉన్నవి అనర్హం
అనుమానాస్పద లబ్ధిదారుల్లో 60 శాతం మంది అనర్హులని తేలింది. వీరిలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, చనిపోయినవారు, రెండు చోట్ల రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఉన్నారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా వారి పేర్లను తొలగించాలని నిర్ణయించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో అనర్హుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.