NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి
    తదుపరి వార్తా కథనం
    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి
    తమిళనాడులో రోడ్డు ప్రమాదం

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి

    వ్రాసిన వారు Stalin
    Dec 24, 2022
    10:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడులోని తేని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది అయ్యప్ప భక్తులు మృత్యువాత పడ్డారు. స్వాములు ప్రయాణిస్తున్న వాహనం దాదాపు 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

    తమిళనాడులోని అండిపట్టి సమీపంలోని సన్ముగసుందరపురం గ్రామానికి చెందిన పది మంది అయ్యప్ప భక్తులు.. శబరిమల దర్శనం చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి వారి కారు ప్రమాదానికి గురైంది.

    తమిళనాడు

    డ్రైవర్ నిద్రమత్తులో..!

    తేని జిల్లాలోని కుములి పర్వత మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే తేని జిల్లా కలెక్టర్ కెవి మురళీధరన్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

    ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. ఒకరు మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించినట్లు కలెక్టర్ చెప్పారు. మరో ఇద్దరిని రక్షించినట్లు వెల్లడించారు. రక్షించిన వారిలో 9ఏళ్ల బాలుడు ఉన్నట్లు పేర్కొన్నారు.

    కుములి పర్వత మార్గంలో మూలమలుపులు ఎక్కవగా ఉంటాయి. ఈ క్రమంలో డ్రైవర్ నిద్రమత్తలో నియంత్రణ కోల్పోవడం వల్ల.. వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగిన ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025