NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి
    భారతదేశం

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 24, 2022, 10:48 am 0 నిమి చదవండి
    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి
    తమిళనాడులో రోడ్డు ప్రమాదం

    తమిళనాడులోని తేని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది అయ్యప్ప భక్తులు మృత్యువాత పడ్డారు. స్వాములు ప్రయాణిస్తున్న వాహనం దాదాపు 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. తమిళనాడులోని అండిపట్టి సమీపంలోని సన్ముగసుందరపురం గ్రామానికి చెందిన పది మంది అయ్యప్ప భక్తులు.. శబరిమల దర్శనం చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి వారి కారు ప్రమాదానికి గురైంది.

    డ్రైవర్ నిద్రమత్తులో..!

    తేని జిల్లాలోని కుములి పర్వత మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే తేని జిల్లా కలెక్టర్ కెవి మురళీధరన్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. ఒకరు మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించినట్లు కలెక్టర్ చెప్పారు. మరో ఇద్దరిని రక్షించినట్లు వెల్లడించారు. రక్షించిన వారిలో 9ఏళ్ల బాలుడు ఉన్నట్లు పేర్కొన్నారు. కుములి పర్వత మార్గంలో మూలమలుపులు ఎక్కవగా ఉంటాయి. ఈ క్రమంలో డ్రైవర్ నిద్రమత్తలో నియంత్రణ కోల్పోవడం వల్ల.. వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగిన ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తమిళనాడు

    తాజా

    ఏప్రిల్ 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    కైల్ మేయర్స్ సునామీ ఇన్నింగ్స్.. లక్నో భారీ స్కోరు డిల్లీ క్యాప్‌టల్స్
    డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజయం ఐపీఎల్
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళ

    తమిళనాడు

    తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం తాజా వార్తలు
    బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం అగ్నిప్రమాదం
    Tamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే బీజేపీ
    తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం! ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023