NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌.. 804 ప్రత్యేక రైళ్లు 
    తదుపరి వార్తా కథనం
    Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌.. 804 ప్రత్యేక రైళ్లు 
    దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌

    Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌.. 804 ప్రత్యేక రైళ్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 23, 2024
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దీపావళికి ఇంటికి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మంచి వార్తలు ప్రకటించింది.

    దీపావళి, ఛత్ పండుగలను పురస్కరించుకుని అధికారులు 804 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు.

    అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణించేవారికి U.T.S. మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

    ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే శాఖ అభ్యర్థించింది.

    గత సంవత్సరం 626 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుండగా, ఈ సంవత్సరం 178 అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

    వివరాలు 

    ప్రత్యేక రైళ్లలో రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు

    ప్రయాణికుల రద్దీని బట్టి బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు.

    సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి షాలిమార్, రాక్స్‌ల, జయపుర, హిస్సార్, గోరఖ్‌పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చిల వంటి ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.

    ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని,పండుగల సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రైళ్లను నడిపిస్తామని రైల్వేశాఖ తెలిపింది.

    అదనంగా, మదురై,ఈరోడ్,నాగర్‌కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వెల్, దాదర్ తదితర ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

    ప్రత్యేక రైళ్లలో రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉన్నాయని తెలిపారు.

    వివరాలు 

    41 రైళ్లు రద్దు

    అయితే, దానా తుపాను కారణంగా, దక్షిణ మధ్య రైల్వే 41 రైళ్లను రద్దు చేసింది.

    ఈ నెల 23, 24, 25, 27 తేదీలలో పలువురు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ తెలిపారు.

    రద్దయిన రైళ్ల వివరాలను సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ రద్దయిన రైళ్లలో ఎక్కువ భాగం హౌదా, భువనేశ్వర్, ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్), పూరి మరియు ఇతర ప్రాంతాలకు చెందినవి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు అనంతపురం అర్బన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025