NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ECI: 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 86% అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఎన్నికల సంఘం
    తదుపరి వార్తా కథనం
    ECI: 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 86% అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఎన్నికల సంఘం
    2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 86% అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఎన్నికల సంఘం

    ECI: 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 86% అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు: ఎన్నికల సంఘం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 27, 2024
    08:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

    అయితే, వారిలో 7,190 మంది తమ డిపాజిట్లను కోల్పోయారు, అంటే 86 శాతం మంది తగినన్ని ఓట్లు పొందలేకపోయారు.

    ఈ అభ్యర్థులలో 584 మంది ఆరు జాతీయ గుర్తింపు పొందిన పార్టీలకు చెందినవారు, 68 మంది రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, 2,633 మంది నమోదు అయిన కానీ గుర్తింపు పొందని రాజకీయ పార్టీల అభ్యర్థులు.

    ఇక స్వతంత్ర అభ్యర్థులు 3,095 మంది ఉండగా, వారిలో కేవలం ఏడుగురు మాత్రమే విజయం సాధించారు. ఈ వివరాలను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

    వివరాలు 

    6 జాతీయ పార్టీలకు 63 శాతం ఓట్లు 

    2024 లోక్‌సభ ఎన్నికలలో చెల్లుబాటైన ఓట్లలో 63 శాతం ఓట్లు 6 జాతీయ పార్టీలకు దక్కాయి.

    ఈ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్‌పీ, సీపీఎం, ఆప్‌, ఎన్‌పీపీ. వీటితో పాటు గుర్తింపు పొందిన 47 రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు, 690 గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి.

    3,921 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేయగా, వారిలో ఏడుగురు మాత్రమే గెలిచారు.

    నోటా (NOTA)కు 63,71,839 ఓట్లు, అంటే 0.99 శాతం ఓట్లు లభించాయి. ఇది 2019లో నమోదైన 1.06 శాతానికి తక్కువ.

    వివరాలు 

    దేశంలోని మొత్తం ఓటర్లు 

    97.97 కోట్లు: దేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య

    64.64 కోట్లు: ఓటింగ్‌లో పాల్గొన్నవారు

    65.78% మహిళలు

    65.55% పురుషులు

    ఈవీఎం ద్వారా ఓటు వేసిన వారు: 64,21,39,275

    పోస్టల్ బ్యాలట్‌ ద్వారా ఓటు చేసిన వారు: సుమారు 43 లక్షల మంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం

    తాజా

    Kannappa: 'కన్నప్ప' ఫైనల్ చాప్టర్.. కామిక్ బుక్ చివరి అధ్యాయం రిలీజ్ కన్నప్ప
    Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు! అమెరికా
    Airtel Fraud Detection: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా 'ఫ్రాడ్‌ డిటెక్షన్‌' ఫీచర్‌ అందుబాటులోకి! ఎయిర్ టెల్
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    ఎన్నికల సంఘం

    Election Commission of India:ఈసీ కీలక నిర్ణయం.. ఆరు రాష్ట్రాల్లో హోం సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ భారతదేశం
    Lok sabha Elections:లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల   భారతదేశం
    EC: కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు  భారతదేశం
    Election Notification: నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025