'సర్జికల్ స్ట్రైక్'తోనే మణిపూర్ సమస్య పరిష్కారం: ఎన్పీపీ
మణిపూర్లో 'అక్రమ వలసదారులు, మిలిటెంట్ల' సమస్య పరిష్కరానికి 'సర్జికల్ స్ట్రైక్' వంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పిపి) నాయకుడు ఎం. రామేశ్వర్ సింగ్ అన్నారు. మణిపూర్లో ఎన్పీపీ- బిజెపికి మిత్రపక్షంగా ఉంది. మూడు నెలలుగా జరుగుతున్న జాతి ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలో అట్టుడుకుతోంది. ఇందులో ఇప్పటివరకు 150మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది తీవ్రవాదులు, వలసదారులు సరిహద్దు దాటి వస్తున్నారని హోం మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటన వచ్చిందని, బయటి నుంచి వచ్చిన సంఘ వ్యతిరేకులు రాష్ట్రంలో ఉన్నారని ఎప్పటి నుంచో తాను చెబుతున్నట్లు రామేశ్వర్ సింగ్ చెప్పారు. ఇది మణిపూర్కు చెందినది మాత్రమే కాకుండా, దేశ భద్రతకు సంబంధించినదిగా ఆయన పేర్కొన్నారు.