NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gurugram: భార్యను చంపి..కుమారుడిని గదిలో బంధించి.. భర్త ఆత్మహత్య 
    తదుపరి వార్తా కథనం
    Gurugram: భార్యను చంపి..కుమారుడిని గదిలో బంధించి.. భర్త ఆత్మహత్య 
    Gurugram: భార్యను చంపి..కుమారుడిని గదిలో బంధించి.. భర్త ఆత్మహత్య

    Gurugram: భార్యను చంపి..కుమారుడిని గదిలో బంధించి.. భర్త ఆత్మహత్య 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 02, 2024
    10:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గురుగ్రామ్‌లో తన భార్యను చంపిన కొన్ని గంటల తర్వాత ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

    భార్యను చంపిన సమయంలోనే వారి రెండేళ్ల కుమారుడిపై దాడి చేసి ఇంట్లోనే వదిలేసి తాళం వేసి పారిపోయాడు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తి సంఘటన స్థలం నుండి పారిపోయి ఘజియాబాద్‌లోని కౌశాంబి మెట్రో స్టేషన్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

    గౌరవ్ శర్మ (30) అనే వ్యక్తి పదునైన ఆయుధంతో తన భార్య గొంతు కోసి ఇటుకతో తలపై కొట్టాడని పోలీసులు తెలిపారు.

    ఆ వ్యక్తి తన కొడుకును కూడా ఇటుకతో కొట్టాడని వారు తెలిపారు. అతని భార్య లక్ష్మీ రావత్ (24)గా గుర్తించారు.

    Details 

    గాయపడిన చిన్నారి ఆసుపత్రికి తరలింపు 

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం DLF ఫేజ్ 3లోని ఓ ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపిస్తుండటంతో స్థానికులు సెక్యూరిటీ గార్డుకు సమాచారం అందించారు.

    గార్డు అర్థరాత్రి ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు తలుపులు పగులగొట్టి చూడగా మహిళ మృతదేహం, గాయపడిన చిన్నారి ఏడుస్తూ కనిపించింది.

    గాయపడిన చిన్నారిని వెంటనే సివిల్‌ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు.

    ఆ తర్వాత అతడిని మహిళ కుటుంబ సభ్యులకు అప్పగించి, ఆగ్రాలోని వారి స్వగ్రామానికి తీసుకెళ్లారు.

    Details 

    భార్య,భర్తల మధ్య ఘర్షణ 

    ఆగ్రాకు చెందిన లక్ష్మి తన భర్త గౌరవ్‌తో కలిసి గురుగ్రామ్‌లో ఉంటోంది. ఈ జంట ఆరు నెలల క్రితం గురుగ్రామ్‌కు మకాం మార్చారు.

    గౌరవ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడని, కొన్న రోజులుగా ఖాళీగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మధ్య భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారని చుట్టూ పక్కవారు తెలిపారు.

    ఈ క్రమంలో వారిరువురి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దఎత్తున ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటుకతో కొట్టడంతో మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025