Loading...
Air India: ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కీలక పరిణామం.. పైలట్‌కు మారిజువానా పాజిటివ్
ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కీలక పరిణామం.. పైలట్‌కు మారిజువానా పాజిటివ్

Air India: ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కీలక పరిణామం.. పైలట్‌కు మారిజువానా పాజిటివ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI2379 విమానంలో ఆగస్టు 4న చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయిన ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విమానానికి పైలట్ ఇన్ కమాండ్‌గా వ్యవహరించిన వ్యక్తికి నిర్వహించిన డ్రగ్ పరీక్షలో మారిజువానా (గంజాయి) పాజిటివ్‌గా వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానం ఘటన అనంతరం నిబంధనల ప్రకారం పైలట్ ఇన్ కమాండ్,కో-పైలట్‌లకు తప్పనిసరిగా సైకోఆక్టివ్ సబ్‌స్టెన్స్ స్క్రీనింగ్ నిర్వహించారు. కో-పైలట్‌కు చేసిన పరీక్షలో ఎలాంటి అనుమానాస్పద ఫలితం కనిపించలేదు. అయితే పైలట్ ఇన్ కమాండ్‌కు నిర్వహించిన పరీక్షలో మారిజువానా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.

వివరాలు 

రెండు అంశాలపై దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ

ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరు పైలట్లను ఫ్లయింగ్ రోస్టర్ నుంచి తొలగించారు.

అయితే డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన అంశం బయటపడినప్పటికీ.. విమానం నడిపే సమయంలో పైలట్ మత్తులో ఉన్నాడని ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు.

అలాగే విమానం అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల కిందకు జారిపోవడానికి పైలట్ డ్రగ్స్ తీసుకోవడమే కారణమని కూడా అధికారులు ఇంకా తేల్చలేదు.

ఈ రెండు అంశాలపై దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాయి.

ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌బస్ A320 విమానం అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయింది.

ఆ సమయంలో విమానంలో ముగ్గురు శిశువులు సహా మొత్తం 137 మంది ప్రయాణికులు ఉన్నారు.

వివరాలు 

ఘటనలో మొత్తం 17 మందికి గాయాలు 

వీరితో పాటు ఇద్దరు పైలట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం 17 మంది గాయపడ్డారు.

విమానంలో చోటుచేసుకున్న ఈ ఆకస్మిక పరిణామానికి టర్బులెన్స్ కారణమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఘటనలో కొందరు ప్రయాణికులకు వెన్నెముక, మెడ భాగాల్లో గాయాలైనట్లు ఆయన వెల్లడించారు.

అయితే విమానం చివరకు ఎలాంటి అదనపు ప్రమాదం లేకుండా ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

ADVERTISEMENT

వివరాలు 

అధికారిక దర్యాప్తును ప్రారంభించిన AAIB

ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీవ్రంగా పరిగణించింది.

దీనిపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అధికారిక దర్యాప్తును ప్రారంభించింది.

విమానంలో ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు కీలకమైన ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR)లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో నమోదైన సమాచారాన్ని విశ్లేషించిన తర్వాతే విమానం ఎత్తు ఎందుకు కోల్పోయింది, ఘటనకు అసలు కారణాలేమిటనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT