NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Budget Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. విపక్ష ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత 
    తదుపరి వార్తా కథనం
    Budget Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. విపక్ష ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత 
    Budget Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. విపక్ష ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత

    Budget Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. విపక్ష ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత 

    వ్రాసిన వారు Stalin
    Jan 30, 2024
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం(జనవరి 31) నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి.

    ఈ క్రమంలో గత పార్లమెంట్ సెషన్‌లో సస్పెండ్ అయిన విపక్ష ఎంపీలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

    బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో విపక్ష ఎంపీలందరిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

    శీతాకాల సమావేశాల సందర్భంగా సస్పెండ్ చేసిన విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేస్తామన్నారు.

    శీతాకాల సమావేశాల్లో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

    లోక్‌సభలో భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర గందరగోళం మధ్య విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.

    బడ్జెట్

    జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

    పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది.

    ఈ సందర్భంగా గత సెషన్‌లో సస్పెండ్ అయిన ఎంపీలను ఈ సమావేశాలకు అనుమతిస్తారా? అని విపక్షాలు అధికార పక్షాన్ని అడిగాయి.

    అయితే సస్పెన్షన్‌కు గురైన ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.

    విషయంపై తాను ఇప్పటికే నేను లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు. 146మంది ఎంపీల్లో 132మందిని శీతాకాల సమావేశాల వరకు మాత్రమే సస్పెండ్ చేశారు.

    మిగిలిన 14మందిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందులో 11మంది రాజ్యసభ నుంచి, 3మంది లోక్‌సభ నుంచి ఉన్నారు.

    ఇప్పుడు ఆ 14మందిపై కూడా సస్పెన్షన్ ఎత్తివేస్తామని ప్రహ్లాద్ జోషి చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్
    బడ్జెట్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    పార్లమెంట్

    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం  నరేంద్ర మోదీ
    పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన  పార్లమెంట్ కొత్త భవనం
    పార్లమెంటులో నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ.. భారత్- కెనడా సంబంధాలపై కీలక చర్చ నరేంద్ర మోదీ
    అమెరికా పార్లమెంట్ స్పీకర్‌ తొలగింపు.. 234ఏళ్ల యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి  అమెరికా

    బడ్జెట్

    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు రుణం
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి ఆర్థిక శాఖ మంత్రి
    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది? తెలంగాణ

    తాజా వార్తలు

    Bank Holidays: ఫిబ్రవరిలో 11రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏఏ రోజున మూసి ఉంటాయంటే..  బ్యాంక్
    Jaggery benefits: భోజనం తర్వాత బెల్లం తింటే.. బోలెడన్ని ప్రయోనాలు  బెల్లం
    Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా  అమిత్ షా
    Land For Job Scam: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, కుమార్తెకు దిల్లీ కోర్టు సమన్లు  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025