NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఏపీకి కూడా కేటాయించే యోచనలో బీజేపీ

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?

    వ్రాసిన వారు Stalin
    Jan 06, 2023
    05:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. అనుకున్నట్లుగా తెలంగాణలో కాస్త పుంజుకున్నా.. ఏపీలో మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న కేంద్ర‌మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఏపీకి ప్రాధాన్యత కల్పించొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

    తెలంగాణలో బీజేపీకి ఒక రాజ్యసభ, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. అందులో సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. మరొకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే.. మిగతా నలుగురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రధానంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

    బీజేపీ

    ఆ అవకాశం జీవీఎల్‌కే దక్కొచ్చా?

    తెలంగాణలో బీజేపీకి ఉత్తర తెలంగాణ నుంచి ఎంపీలు ఎక్కువగా ఉన్నారు. దక్షిణ తెలంగాణ కోటాలో ఎలాగూ.. కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నందున.. ఉత్తర తెలంగాణ కోటాలో.. బండిసంజయ్ లేదా అరవింద్‌కు కేంద్ర సహాయ‌మంత్రి పదవి ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతుంది.

    ఒకవేళ సీనియార్టిని పరిగణలోకి తీసుకుంటే.. లక్ష్మణ్‌కు స్వతంత్ర లేదా కేంద్రమంత్రి హోదాను కట్టబెట్టే అవకాశం ఉంది. వీరిలో బండిసంజయ్, లక్ష్మణ్‌ ప్రస్తుతం పార్టీ కీలక పదవుల్లో ఉన్నారు. వీరికి ప్రభుత్వ పదవులు ఇచ్చే అవకాశాలు తక్కువే అని చెప్పాలి.

    ఏపీలో బీజేపీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒకరు జీవీఎల్ నరిసింహరావు, ఇంకకరు సీఎం. రమేష్. కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే పార్టీలో సీనియర్ అయిన జీవీఎల్‌కే అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అమిత్ షా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ గుజరాత్
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025