తదుపరి వార్తా కథనం

Swarnandhra-2047:'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 13, 2024
12:37 pm
ఈ వార్తాకథనం ఏంటి
'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
ఈ డాక్యుమెంట్ లక్ష్యంగా రాష్ట్రం లో ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అందించే మార్గాలను సూచించడమే.
ఈ కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు, పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'పది సూత్రాలు.. ఒక విజన్' పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంట్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.
డాక్యుమెంట్ జాతి, రాష్ట్ర ప్రజల కోసం అంకితమై ఉన్నట్లు పేర్కొని, సీఎమ్ చంద్రబాబు నాయుడు దానిపై సంతకం చేశారు.
అనంతరం పవన్కల్యాణ్, మంత్రి లోకేశ్, పలువురు ఎమ్మెల్యేలు,అధికారులు కూడా సంతకాలు చేశారు.