NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గడపగడపకు ప్రోగ్రాంలో సీఎం జగన్ అసంతృప్తి.. గ్రాఫ్ పడిపోతే టిక్కెట్లు ఇవ్వనని స్పష్టం
    తదుపరి వార్తా కథనం
    గడపగడపకు ప్రోగ్రాంలో సీఎం జగన్ అసంతృప్తి.. గ్రాఫ్ పడిపోతే టిక్కెట్లు ఇవ్వనని స్పష్టం
    గ్రాఫ్ పడిపోతే టిక్కెట్లు ఇవ్వలేను : సీఎం జగన్

    గడపగడపకు ప్రోగ్రాంలో సీఎం జగన్ అసంతృప్తి.. గ్రాఫ్ పడిపోతే టిక్కెట్లు ఇవ్వనని స్పష్టం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 22, 2023
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీలోని వైసీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్‌ సమావేశం నిర్వహించారు.

    కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు.

    ఈ క్రమంలో 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తొందరలోనే పని తీరు మెరుగుపర్చుకోకపోతే తానే ఓ నిర్ణయం తీసుకుంటానన్నారు.

    అయితే సగం మందికిపైగా శాసనసభ్యుల గ్రాఫ్ మరింత పెరగాల్సి ఉందని జగన్ స్పష్టం చేశారు. పని తీరు బాగుంటేనే ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తామని, పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంటే సహించబోమన్నారు.

    DETAILS

    టిక్కెట్లు రాకుంటే చివరి క్షణంలో నన్ను బాధ్యుడిని చేయొద్దు : సీఎం జగన్

    తన వద్ద సర్వే వివరాలు ఉన్నాయని, ఇకపై చేసే సర్వేల్లోనూ కంపల్సరీగా గ్రాఫ్‌ పెరగాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్తేనే గ్రాఫ్‌ పెరుగుతుందని, లేకుంటే గ్రాఫ్‌ పెరగదని జగన్ సూచించారు.

    పనితీరు బాగాలేకపోతే టిక్కెట్లు ఇవ్వడం కుదరదని, చివరి క్షణంలో తనను బాధ్యుడిని చేయొద్దని ఎన్నికలకు ముందే జగన్ తేల్చిచెప్పారు.

    మరో 2 రోజుల్లో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం కానుందని, అందరూ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలతో కలిసి ముందుకు సాగాలన్నారు.

    ప్రతీ సచివాలయానికి ఎమ్మెల్యే, అధికారులతో కలిసి వెళ్లి ప్రజాసమస్యలేంటో నేరుగా తెలుసుకోవాలన్నారు. అడిగిన ప్రతీ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు.

    అధికారులు కూడా ఏవీ పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు ఆయా సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం వర్షాకాలం
    ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ప్రభుత్వం
    వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ సీబీఐ
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025