LOADING...
Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి షాక్.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు 
వల్లభనేని వంశీకి షాక్.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి షాక్.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ ఎదురైంది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ-71 నిందితుడిగా ఉన్న వంశీ, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, బెయిల్ మంజూరు చేయడం సాధ్యపడదని స్పష్టం చేస్తూ, పిటిషన్‌ను కొట్టివేసింది.

వివరాలు 

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచన

ఈ మేరకు, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. అంతకుముందు, దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, మంగళవారం జైలులో వంశీని ములాఖత్ సమయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు జగన్ వంశీతో చర్చించారు. జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ, సింహాద్రి రమేష్ కూడా జైలు లోపలికి వెళ్లారు.

Advertisement