NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KRMB: ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    KRMB: ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు
    ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు

    KRMB: ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 22, 2025
    11:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కృష్ణానదీ యాజమాన్య బోర్డు 19వ సర్వసభ్య సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

    బోర్డు ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాత ఒప్పందం ప్రకారం వచ్చే నీటి సంవత్సరంలోనూ నీటి పంపకాలు కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది.

    తెలంగాణ ప్రతిపాదించినట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో నీటిమీటర్ల (టెలిమీటర్ల) ఏర్పాటు ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. ఈ అంశంపై కమిటీ ఏర్పాటుకూ ఏపీ అనుమతి ఇవ్వలేదు.

    కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు బోర్డు అంగీకారం తెలిపింది.

    సమావేశంలో నీటి పంపకాలపై తీవ్ర చర్చ జరిగింది. అందుబాటులో ఉన్న నీటిని 50:50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా విజ్ఞప్తి చేశారు.

    Details

     66:34 నిష్పత్తిలోనే నీటి పంపకాలు 

    అయితే ప్రస్తుత 66:34 నిష్పత్తిలోనే పంపకాలు జరగాలని ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం. వెంకటేశ్వరరావు వాదించారు. ప్రాజెక్టులకు సంబంధించిన ట్రైబ్యునల్‌ నీటి పంపకాలు ఇప్పటికే పూర్తిచేసిందని, ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు తగ్గించుకోగలమని ప్రశ్నించారు.

    ట్రైబ్యునల్‌ తీర్పు వెలువడే వరకు పాత ఒప్పందం ప్రకారం పంపకాలు కొనసాగించాలని (ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు) బోర్డు నిర్ణయించింది.

    ఈ పంపకాలను త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. ఇక తెలంగాణ అధికారులు ఏపీలో నీటి వాడకాన్ని నియంత్రించేందుకు టెలిమీటర్ల ఏర్పాటును ప్రతిపాదించారు.

    బొల్లాపల్లి, హంద్రీనీవా కాలువలు వంటి ప్రదేశాల్లో నీటిమీటర్లు ఏర్పాటుకు సిద్ధమని, అవసరమైతే ఖర్చు కూడా భరిస్తామని పేర్కొన్నారు.

    Details

    నీటి మీటర్లు అవసరం లేదు

    కానీ ఈ ప్రతిపాదనను ఏపీ త్రోసిపుచ్చింది. మా నీటిని మేమే ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇందుకు నీటిమీటర్లు అవసరం లేదని ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

    ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించినా, ఏపీ ఇందుకు అంగీకరించలేదు. విజయవాడలో 17,000 చదరపు అడుగుల స్థలం కేటాయిస్తే, బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అక్కడికి తరలించేందుకు బోర్డు అంగీకారం తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ అధికారులు తెలిపారు.

    Details

    సీఆర్‌పీఎఫ్‌ బృందాలపై చర్చ 

    నాగార్జునసాగర్ కుడి వైపున సీఆర్‌పీఎఫ్‌ను తొలగించాలని, లేదా రెండు వైపులా సీఆర్‌పీఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేయాలని ఏపీ కోరింది.

    ప్రస్తుతం కొనసాగిస్తామని, కొన్ని రోజులు పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటామని బోర్డు పేర్కొంది.

    తెలంగాణపై అభ్యంతరాలు

    విద్యుత్తు ఉత్పత్తి పేరుతో ప్రాజెక్టులను ఖాళీ చేస్తూ నీటిని వాడుతున్నందున ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. న్యాయపరమైన అంశాలు

    పలు కీలక అంశాలు న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున పెద్ద చర్చలు జరగలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    తెలంగాణ

    Telangana: తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్‌ జారీ చేసిన సర్కార్.. కొత్త పేర్లు ప్రతిపాదన భారతదేశం
    Telangana: తెలంగాణ ఆలయాల్లో బంగారం నిల్వలు.. టాప్‌లో వేములవాడ రాజన్న ఆలయం భారతదేశం
    Telangana Govt: ఫార్ములా ఈ రేస్ వివాదం.. లావాదేవీలను బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్
    Hyderabad: పాతబస్తీ మెట్రో భూసేకరణ.. 40 నిర్వాసితులకు పరిహార చెక్కులు అందజేత హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    Transfers of Teachers: భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు! ఇండియా
    Tirupati: తిరుపతికి ఆరు వరుసల రహదారి.. అందుబాటులోకి నాయుడుపేట - రేణిగుంట రహదారి  భారతదేశం
    AP Inter:సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలకు ప్రతిపాదనలు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!  భారతదేశం
    Council of Higher Education: ఆ విద్యా సంస్థలపై కఠిన చర్యలు.. ఉన్నత విద్యామండలి హెచ్చరిక  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025