NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra news: నదులు, జలాశయాల్లో రాత్రి వేళల్లోనూ బోట్లు.. రాష్ట్రంలో ఐదుచోట్ల ఈ సేవలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra news: నదులు, జలాశయాల్లో రాత్రి వేళల్లోనూ బోట్లు.. రాష్ట్రంలో ఐదుచోట్ల ఈ సేవలు 
    నదులు, జలాశయాల్లో రాత్రి వేళల్లోనూ బోట్లు.. రాష్ట్రంలో ఐదుచోట్ల ఈ సేవలు

    Andhra news: నదులు, జలాశయాల్లో రాత్రి వేళల్లోనూ బోట్లు.. రాష్ట్రంలో ఐదుచోట్ల ఈ సేవలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలోని అలెప్పీలో బోటు షికారు మాదిరిగా సౌకర్యాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

    అందుకోసం, రాష్ట్రంలో వివిధ నదులు, తీరప్రాంతాల పై పర్యాటక బోట్లు సిద్ధం చేయబోతోంది .

    ఈ కార్యక్రమం ప్రైవేటు రంగంతో సమన్వయం అవుతూ, పర్యాటక రంగానికి నూతన ప్రేరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

    బోట్లను నడిపించేందుకు ఆసక్తి ఉన్న వ్యాపారవేత్తల నుంచి ఆహ్వాన ప్రకటనలు విడుదల చేయాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది.

    రాష్ట్రానికి ఉన్న పొడవైన తీర ప్రాంతం గొప్ప ప్రాముఖ్యత కలిగిన వరంగా నిలుస్తోంది.

    గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార వంటి సుమారు 25 నదులు రాష్ట్రంలో ఉన్నందున వీటిని పర్యాటక ప్రోత్సాహానికి ఉపయోగించేందుకు ప్రభుత్వం వ్యూహాలను రూపొందిస్తోంది.

    వివరాలు 

    ఒక్కో బోటులో రెండు గదులు..

    ఈ ప్రణాళికలో భాగంగా ఐదు ప్రాంతాలలో సకల సౌకర్యాలతో కూడిన బోట్లను నడపాలని నిర్ణయించారు.

    కోనసీమ జిల్లా దిండిలో ఇప్పటికే రెండుబోట్లు ప్రారంభమయ్యాయి. గోదావరి నది వశిష్ట పాయ వద్ద పగలు బోట్లు నడిపించి, సాయంత్రం 6 గంటల తర్వాత హరిత రిసార్ట్‌ వద్ద నిలిపివేస్తున్నారు.

    ప్రస్తుతం ఒక్క బోటు మాత్రమే రాత్రిపూట బస చేయడానికి ఉపయోగిస్తున్నారు. రెండో బోటుకు మరమ్మతులు చేయాల్సి ఉంది.

    కొత్తగా ప్రవేశపెట్టే బోట్లలో కొన్నింటిని రాత్రి కూడా నడిపించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఒక్కో బోటులో రెండు గదులు ఉంటాయి, అందులో రెస్టారెంట్, వినోద కార్యక్రమాలు కూడా ఉంటాయి.

    ఒకటి లేదా రెండు రోజుల పాటు బోటులో ప్రయాణించేందుకు ప్యాకేజీలు రూపొందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

    వివరాలు 

    ఇతర ప్రాంతాలలో కూడా బోటు ప్రయాణాల ఏర్పాటు 

    ఇది కేవలం కొన్ని ప్రాంతాలపై మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాలలో కూడా బోటు ప్రయాణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆలోచనలు ఉన్నాయి:

    విజయవాడ - భవానీ ద్వీపం నుండి కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వరకు కొత్త బోటు ప్రయాణాలు ప్రారంభించబోతున్నారు. పర్యాటకులు మార్గమధ్యలో పలు ప్రసిద్ధ ఆలయాలను సందర్శించవచ్చు.

    పాపికొండలు - పర్యాటకులు ఒకటి లేదా రెండు రోజులపాటు బోటులోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

    గండిపోచమ్మ - పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రస్తుతం ఒక బోటును నడుపుతోంది.

    కోనసీమ జిల్లా - సముద్రతీర ప్రాంతం అంతర్వేది నుండి బోటు నడుపుతున్నాయి. పర్యాటకులు పగలు, రాత్రి బోటులోనే ఉండేలా ప్యాకేజీలు సిద్ధం చేస్తున్నారు.

    వివరాలు 

    మైలవరం - రిజర్వాయర్ నుండి గండికోట కెనాల్ వరకు బోటు

    వైఎస్సార్ జిల్లా - గండికోట అందాలను చూడడానికి ఆధునిక బోటును ప్రవేశపెట్టారు. రాత్రి బస చేసుకునే సౌకర్యంతో బోటు అందుబాటులో ఉంటుంది.

    మైలవరం - రిజర్వాయర్ నుండి గండికోట కెనాల్ వరకు బోటు నడుపుతున్నారు. ప్రస్తుతం రెండుబోట్లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో మరిన్ని సౌకర్యాలు అందించాల్సి ఉంది.

    అల్లూరి జిల్లా - చింతపల్లి మండలంలో తాజంగి జలాశయంలో బోటు నడపాలని భావిస్తున్నారు. లంబసింగి సందర్శకులు తాజంగి జలాశయాన్ని సందర్శిస్తున్నారు.

    ఈ బోటు ప్రయాణాల ద్వారా పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    పర్యాటకం

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: విశాఖ,తిరుపతిలో త్వరలో పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు భారతదేశం
    Ap Highcourt : గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల పెంపుపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు సినిమా
    Venkaiah Naidu: 'తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు'.. వెంకయ్యనాయుడు హెచ్చరిక ఉప రాష్ట్రపతి
    Parents Property Rights: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కి..!  భారతదేశం

    పర్యాటకం

    చంద్రుడి మీద నడుస్తున్న అనుభూతిని అందించే ఈజిప్టులోని ఈ ప్రదేశాన్ని సందర్శించండి  లైఫ్-స్టైల్
    ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారా? ఈ జీఐ ట్యాగ్ వస్తువులను కొనడం మర్చిపోవద్దు  ఆంధ్రప్రదేశ్
    బ్యాచిలరెట్టే పార్టీ ఎక్కడ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇండియాలోని ఈ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి.  ఇండియా
    ప్రపంచంలో చెప్పుకోదగిన పండగలు, తెలుసుకోవాల్సిన విషయాలు  పండగ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025