Arun Yogiraj: 'భూమిపై నేనే అత్యంత అదృష్టవంతుడిని'.. శ్రీరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్
అయోధ్యలో సోమవారం రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమం అనంతరం శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి అరుణ్ యోగిరాజ్ మీడియాతో మాట్లాడారు. పంచంలోనే అత్యంత అదృష్టవంతుడిని తానేనని చెప్పుకొచ్చారు. తన పూర్వీకులు, కుటుంబ సభ్యులు, శ్రీరాముడి ఆశీస్సులు తనకు ఎల్లపుడూ ఉన్నాయన్నారు. కొన్నిసార్లు తనకు కలల ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. అయోధ్యలోని కొత్త ఆలయంలో బంగారం, పూలతో అలంకరించబడిన 51 అంగుళాల రాంలాలా విగ్రహాన్ని సోమవారం ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలో వైభవంగా జరిగింది. ఈ అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, 8 వేల మందికి పైగా అతిథులు, సాధువులు, అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు.