NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే 
    తదుపరి వార్తా కథనం
    రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే 
    రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

    రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే 

    వ్రాసిన వారు Stalin
    Jan 14, 2024
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' ప్రారంభమైంది.

    ఈ యాత్రను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయజెండా ఊపి ప్రారంభించారు.

    లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది.

    10 ఏళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఎండగడుతూ ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.

    యాత్రను ప్రారంభించే ముందు రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఖోంగ్‌జోమ్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు.

    1891లో బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన మణిపూర్ స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకార్థం ఈ స్మారకాన్ని నిర్మించారు.

    కాంగ్రెస్

    67 రోజుల్లో ప్రతి రోజు రెండు సభల్లో రాహుల్ ప్రసంగం

    న్యాయ యాత్రను ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ తౌబాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

    పేదలు, అణగారిన, దోపిడీకి గురవుతున్న వారికి న్యాయం చేయడం కోసం ఈ యాత్ర చేపడుతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.

    రాహుల్ చేపట్టిన ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాల గుండా 6,700 కిలోమీటర్లకు పైగా సాగనుంది. 15 రాష్ట్రాలు, 100 లోక్‌సభ స్థానాల్లో పర్యటించనున్నారు.

    ఈ యాత్ర మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్రలోని ముంబైకి చేరుకుంటుంది.

    ఈ యాత్రలో రాహుల్ ప్రతిరోజూ 2 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు,

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జాతీయ జెండా ఊపి యాత్రను ప్రారంభించిన ఖర్గే

    आज कांग्रेस अध्यक्ष श्री @kharge ने श्री @RahulGandhi को राष्ट्रीय ध्वज देकर 'भारत जोड़ो न्याय यात्रा' का शुभारंभ किया।

    मणिपुर से मुंबई तक 6700 किलोमीटर की यात्रा में यह ध्वज राहुल जी के साथ रहेगा।#BharatJodoNyayYatra pic.twitter.com/EZm1i1rzde

    — Congress (@INCIndia) January 14, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    మల్లికార్జున ఖర్గే
    మణిపూర్
    తాజా వార్తలు

    తాజా

    Microsoft : మరో 300మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసిన మైక్రోసాఫ్ట్‌  మైక్రోసాఫ్ట్
    AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..  స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం హైకోర్టు
    Australia: భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.. జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతమంటూ ఆరోపణ ఆస్ట్రేలియా
    Virat Kohli: ఐపీఎల్‌కు కోహ్లీ గుడ్‌బై చెప్పనున్నాడా..? అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలతో ఊహాగానాలు! విరాట్ కోహ్లీ

    రాహుల్ గాంధీ

    2024లో మరోసారి అమేథీ బరిలో దిగనున్న రాహుల్.. ప్రకటించిన యూపీ కాంగ్రెస్ చీఫ్ భారతదేశం
    పాంగాంగ్ సరస్సుకు రాహుల్ గాంధీ బైక్ రైడ్; స్టైలిష్ లుక్‌లో కాంగ్రెస్ నేత  లద్దాఖ్
    Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు లద్దాఖ్
    2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: అశోక్ గెహ్లాట్ అశోక్ గెహ్లాట్

    మల్లికార్జున ఖర్గే

    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కాంగ్రెస్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీ
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    మణిపూర్

    జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్  జీ20 సమావేశం
    Manipur violence: మణిపూర్‌ హింసపై సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించిన జస్టిస్ మిట్టల్ కమిటీ సుప్రీంకోర్టు
    మణిపూర్ దుస్థితికి కాంగ్రెస్సే కారణమన్న బీరెన్ సింగ్.. సీఎం రాజీనామాకు సీపీఐ పట్టు  బీరెన్ సింగ్
    నేటి నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు; రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారి భేటీ  ఇంఫాల్

    తాజా వార్తలు

    Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి  టాలీవుడ్
    Guntur Kaaram First Review: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ.. డైలాగ్స్, యాక్షన్‌తో మహేష్ అదుర్స్ గుంటూరు కారం
    Astrology: చిచ్చుపెట్టిన జ్యోతిష్యం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ  హైదరాబాద్
    Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే?  విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025