రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' ప్రారంభమైంది. ఈ యాత్రను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయజెండా ఊపి ప్రారంభించారు. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. 10 ఏళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఎండగడుతూ ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. యాత్రను ప్రారంభించే ముందు రాహుల్తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఖోంగ్జోమ్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. 1891లో బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన మణిపూర్ స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకార్థం ఈ స్మారకాన్ని నిర్మించారు.
67 రోజుల్లో ప్రతి రోజు రెండు సభల్లో రాహుల్ ప్రసంగం
న్యాయ యాత్రను ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ తౌబాల్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. పేదలు, అణగారిన, దోపిడీకి గురవుతున్న వారికి న్యాయం చేయడం కోసం ఈ యాత్ర చేపడుతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ చేపట్టిన ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాల గుండా 6,700 కిలోమీటర్లకు పైగా సాగనుంది. 15 రాష్ట్రాలు, 100 లోక్సభ స్థానాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్ర మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్రలోని ముంబైకి చేరుకుంటుంది. ఈ యాత్రలో రాహుల్ ప్రతిరోజూ 2 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు,