NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
    వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

    Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 13, 2025
    11:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల వసూళ్ల పరంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో గతేడాది (2023-24)తో పోల్చితే 6 శాతం పెరుగుదల నమోదైందని ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

    2024 మార్చి నెలలో సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (CST),వ్యాట్ (VAT) వసూళ్లలో రూ.600 కోట్ల ఆదాయం వచ్చేలా అంచనా వేసినప్పటికీ, వాస్తవంగా రూ.500 కోట్ల మేర మాత్రమే వసూలైందని ఆయన వివరించారు.

    రాష్ట్రంలో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాల విషయంలో మంచి అభివృద్ధి కనిపించినా,వ్యవసాయ భూములు,ఖాళీ స్థలాల విక్రయాల విషయంలో అనుకున్నంత పురోగతి కనిపించకపోవడం గమనార్హమని తెలిపారు.

    ఈ అంశంపై గమనించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

    వివరాలు 

    మంత్రివర్గ ఉపసంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన భట్టి విక్రమార్క 

    నిర్మాణ అనుమతుల జారీ ప్రక్రియలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.

    ఈ ఆర్థిక వనరుల సమీకరణ అంశంపై సోమవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశానికి భట్టి విక్రమార్క అధ్యక్షత వహించారు.

    ఈ సమావేశంలో మంత్రులు డా.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ధర్మారెడ్డి శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

    సమావేశంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ,తదితర లక్ష్యాలపై చర్చలు కొనసాగాయి.

    వివరాలు 

    ఆబ్కారీ శాఖలో ఆదాయం వచ్చేలా చర్యలు

    ఈ సందర్భంగా భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో అన్ని శాఖలు సరైన ప్రణాళికతో పని చేయాలని స్పష్టం చేశారు.

    టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ విస్తృత తనిఖీలు నిర్వహించడం ద్వారా శాఖల ఆదాయ వృద్ధికి సహకరించాలన్నారు.

    ప్రత్యేకంగా, ఆబ్కారీ శాఖలో ఆదాయం తగ్గిన ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

    అలానే గిరిజన ప్రాంతాల్లో ఇసుక అమ్మకాలను సొసైటీల ద్వారా నిర్వహించాలని, గిరిజన సంక్షేమ శాఖ అర్హులైన గిరిజనులను సొసైటీ సభ్యులుగా చేర్చి వారికి ఆదాయం అందేలా చూడాలన్నారు.

    జిల్లాల కేంద్రాల్లో ఉన్న విలువైన భూములను రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు స్పష్టంగా సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లు భట్టి విక్రమార్క

    తాజా

    Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క
    Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం  మంగళగిరి
    CM Chandrababu: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్
    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే ఆంధ్రప్రదేశ్

    మల్లు భట్టి విక్రమార్క

    Bhatti Vikramarkha : ప్రజాభవన్‌లో కుటుంబసమేతంగా ఉపముఖ్యమంత్రి పూజలు.. అధికార నివాసంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కEmbed హైదరాబాద్
    Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి  తెలంగాణ
    Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు తెలంగాణ
    Telangana: తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: భట్టి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025