NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pana Devi : 3 బంగారు పతకాలు గెలిచిన 92 ఏళ్ల మహిళ .. ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో సత్తా చాటడానికి స్వీడన్‌కు.. 
    తదుపరి వార్తా కథనం
    Pana Devi : 3 బంగారు పతకాలు గెలిచిన 92 ఏళ్ల మహిళ .. ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో సత్తా చాటడానికి స్వీడన్‌కు.. 
    Pana Devi : 3 బంగారు పతకాలు గెలిచిన 92 ఏళ్ల మహిళ

    Pana Devi : 3 బంగారు పతకాలు గెలిచిన 92 ఏళ్ల మహిళ .. ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో సత్తా చాటడానికి స్వీడన్‌కు.. 

    వ్రాసిన వారు Stalin
    Mar 30, 2024
    03:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. ఈ అద్భుతమైన వ్యాఖ్యం అబ్దుల్ కలాం చెప్పారు.

    బికనీర్‌లోని నోఖా తహసీల్‌లోని అంఖిసర్ గ్రామంలో నివసిస్తున్న 92 ఏళ్ల గ్రామీణ మహిళ పనా దేవి గోదారాఈ మాటని అక్షరసత్యాలుగా ప్రూవ్ చేశారు.

    పనా దేవి ఇటీవల పూణేలో జరిగిన 44వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2024లో పాల్గొని మూడు బంగారు పతకాలు (100మీ, షాట్‌పుట్, డిస్కస్ త్రో) గెలుచుకున్నారు.

    ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆడేందుకు పనా దేవి ఇప్పుడు ఆగస్టులో స్వీడన్‌కు వెళ్లనుంది.

    ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ ఫాస్ట్‌ఫుడ్‌, క్యాన్‌డ్‌ ఫుడ్‌, చల్లని నీరు వంటివి తీసుకోలేదన్నారు.ఇదే ఆమె ఆరోగ్య రహస్యం అని తెలిపారు.

    Details 

    మనవాడి ప్రోత్సాహంతో స్టేడియంకు .. 

    పొద్దున్నే లేవడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం వారి దినచర్యలో భాగం. అంతేకాదు తాను ఎలాంటి మందులు వేసుకోనని, ఏళ్ల తరబడి ఎలాంటి మందులు తీసుకోలేదని చెప్పింది.

    92 ఏళ్ల పనా దేవి గోదార మనవడు జై కిషన్ గోదారా తన అమ్మమ్మను ఆడటానికి ప్రేరేపించాడు.

    జై కిషన్ జాతీయ క్రీడాకారుడు. చాలా కాలంగా, అతను ఊరిలోని పిల్లలకు వివిధ క్రీడాలలో శిక్షణ ఇస్తున్నాడు.

    ఒకరోజు తను చేసే పనిని గమనిస్తుందనే నెపంతో బామ్మను వాకింగ్ కోసం స్టేడియానికి తీసుకెళ్లాడు.

    ఆ రోజు తర్వాత నుండి అమ్మమ్మ కూడా నాతో కర్ణి సింగ్ స్టేడియానికి రావడం మొదలుపెట్టింది.

    Details 

     ఆ ఊరి మహిళలకు పనా దేవి స్ఫూర్తి 

    ఆ తర్వాత ఓ రోజు అమ్మమ్మ తనకు కూడా ఆడాలని ఉందని చెప్పింది. అమ్మమ్మ ఎంతో ఏకాగ్రతతో శిక్షణ పొంది ఈ రోజు ఈ స్థాయికి చేరుకుంది.. ఇప్పుడు ఆ ఊరి మహిళలకు స్ఫూర్తినిస్తుంది.

    నేషనల్ గేమ్స్ యాక్టివిటీలో పాల్గొని తిరిగొచ్చిన పనా దేవి.. ఇప్పుడు ఆ గ్రామంలోని మహిళలను గేమ్స్ యాక్టివిటీలో పాల్గొనేలా స్ఫూర్తినిస్తోంది.

    అమ్మమ్మ సాధించిన ఈ విజయం తర్వాత గ్రామంలోని మహిళలు ఆమెను కలవడానికి రావడం ప్రారంభించారని ఆమె మనవడు జై కిషన్ గోదార తెలిపారు.

    ఐదుగురు కుమారులు,ముగ్గురు కుమార్తెల తల్లి అయిన పానా దేవి ఆరోగ్యంగా ఉన్నారని గ్రామస్తులకు తెలుసని, అయితే ఆమె జాతీయ జట్టులో ఆడి గ్రామానికి కీర్తిని తెస్తుందని ఎవరూ అనుకోలేదని గోదార చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    Motivation: ప్రతి తాళానికి తాళంచెవి ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారమూ ఉంటుంది! జీవనశైలి
    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన పాకిస్థాన్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం చైనా

    రాజస్థాన్

    Rajasthan Elections 2023: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే  భారతదేశం
    Teetar Singh : 50ఏళ్లలో 20సార్లు ఓడిపోయారు..అయినా సరే మళ్లీ పోటీకి రెడి  భారతదేశం
    Rajasthan rape: రాజస్థాన్‌లో ఘోరం.. 4ఏళ్ల దళిత బాలికపై సబ్-ఇన్‌స్పెక్టర్ అత్యాచారం  అత్యాచారం
    Rajasthan: 'బీజేపీపై సీఎం గెహ్లాట్ సంచలన ఆరోపణలు.. ఉదయ్‌పూర్ టైలర్ కేసుతో కాషాయం పార్టీకి సంబంధం' అశోక్ గెహ్లాట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025