NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు
    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు
    ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు

    వ్రాసిన వారు Stalin
    Dec 20, 2022
    06:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీజేపీ.. వచ్చేఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో జరగనన్ను ఎలక్షన్లపై ఫోకస్ పెట్టింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో 2023 ప్రారంభంలో.. మిజోరాంలో డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

    ఈశాన్య రాష్ట్రాల్లో విజయతీరాలను తాకేందుకు ప్రధాని మోదీ-హోంమంత్రి అమిత్ షా ద్వయం ఈ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల వీరు మేఘాలయలో పర్యటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను ఒకసారి పరిశీలిద్దాం.

    త్రిపుర: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ 35 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. 60 మంది సభ్యుల గల అసెంబ్లీలో.. బీజేపీ, దాని ప్రత్యర్థి వామపక్షాల మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువగా ఉంది.

    అసెంబ్లీ

    మిజోరంను గెలిచేనా?

    మేఘాలయ: 2018ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోలేకపోయింది. దీంతో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2023ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఎన్‌పీపీ అధినేత కాన్రాడ్ సంగ్మా ఇప్పటికే ప్రకటించారు.

    నాగాలాండ్: 2018లో ఎన్‌డీపీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి.. 40 నియోజకవర్గాల్లో ఎన్‌డీపీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది.

    మిజోరం: 2023ఎన్నికల్లో మిజోరంలోని మొత్తం 40 స్థానాల్లో తమ పార్టీ పోటీచేస్తుందని మిజోరం బీజేపీ చీఫ్ వన్‌లాల్‌ముకా ఇప్పటికే ప్రకటించారు. 2018లో మొదటిసారిగా బీజేపీ మిజోరంలో ఖాతా తెరిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025