NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు
    భారతదేశం

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 20, 2022, 06:46 pm 1 నిమి చదవండి
    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు
    ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీజేపీ.. వచ్చేఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో జరగనన్ను ఎలక్షన్లపై ఫోకస్ పెట్టింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో 2023 ప్రారంభంలో.. మిజోరాంలో డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో విజయతీరాలను తాకేందుకు ప్రధాని మోదీ-హోంమంత్రి అమిత్ షా ద్వయం ఈ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల వీరు మేఘాలయలో పర్యటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను ఒకసారి పరిశీలిద్దాం. త్రిపుర: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ 35 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. 60 మంది సభ్యుల గల అసెంబ్లీలో.. బీజేపీ, దాని ప్రత్యర్థి వామపక్షాల మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువగా ఉంది.

    మిజోరంను గెలిచేనా?

    మేఘాలయ: 2018ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోలేకపోయింది. దీంతో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2023ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఎన్‌పీపీ అధినేత కాన్రాడ్ సంగ్మా ఇప్పటికే ప్రకటించారు. నాగాలాండ్: 2018లో ఎన్‌డీపీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి.. 40 నియోజకవర్గాల్లో ఎన్‌డీపీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. మిజోరం: 2023ఎన్నికల్లో మిజోరంలోని మొత్తం 40 స్థానాల్లో తమ పార్టీ పోటీచేస్తుందని మిజోరం బీజేపీ చీఫ్ వన్‌లాల్‌ముకా ఇప్పటికే ప్రకటించారు. 2018లో మొదటిసారిగా బీజేపీ మిజోరంలో ఖాతా తెరిచింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    మార్చి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    టీఎస్‌పీఎస్‌సీ: మొత్తం 5 పేపర్లు లీకైనట్లు గుర్తించిన సిట్! తెలంగాణ
    ఈరోజు ప్రారంభం కానున్న లోటస్ చాక్లెట్ ఓపెన్ ఆఫర్ వ్యాపారం
    Fake News: నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ బలమైన పోటీదారు అని చెప్పలేదు: అస్లే టోజే నరేంద్ర మోదీ

    చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస నారా లోకేశ్
    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023