దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్
దిల్లీలోని రోహిణిలో స్లమ్ క్లస్టర్లో 16ఏళ్ల బాలికను ఆమె ప్రియుడు కిరాతకంగా హత్య చేశాడు. అమెను దాదాపు 20కంటే ఎక్కువసార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. అంతేకాదు అమె తలపై కత్తితో కూడా దాడి చేసినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆలాగే సమీపంలోని రాయిని తీసుకొని అమెను కొట్టాడు. ఆ బాలికపై దాడి జరుగుతున్న సమయంలో ప్రజలు అటు వైపు వెళ్తున్నా, ఎవరూ నిందితుడిని ఆపడానికి ప్రయత్నించలేదు. దాడి చేసిన యువకుడిని సాహిల్గా గుర్తించారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని, అయితే దాడి జరగడానికి ఒక రోజు ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాహిల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.