Loading...
PM Modi: ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో బ్రిక్స్‌ దేశాల పురోగతి: మోదీ
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో బ్రిక్స్‌ దేశాల పురోగతి: మోదీ

PM Modi: ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో బ్రిక్స్‌ దేశాల పురోగతి: మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
07:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే దాదాపు రెండింతల వేగంతో బ్రిక్స్‌ దేశాలు పురోగమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ కూటమి ప్రాధాన్యం నిరంతరం పెరుగుతోందని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌ నాయకుల సమావేశంలో మోదీ ప్రసంగించారు. ప్రపంచ జనాభాలో 50 శాతం వాటా ప్రస్తుతం బ్రిక్స్‌ దేశాలు ప్రపంచ జనాభాలో సగం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని మోదీ తెలిపారు. ప్రపంచ జీడీపీలో 40 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 25 శాతానికి పైగా వాటా ఈ దేశాలకు ఉందని వివరించారు. ఈ గణాంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్‌ దేశాల పెరుగుతున్న ప్రాధాన్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని అన్నారు.

వివరాలు 

ప్రపంచ జీడీపీ కంటే వేగంగా వృద్ధి

గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు రెండున్నర రెట్లు పెరిగిందని మోదీ చెప్పారు.

ఇదే సమయంలో బ్రిక్స్‌ దేశాల ఉమ్మడి జీడీపీ దాదాపు నాలుగున్నర రెట్లు విస్తరించిందని వివరించారు.

ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్‌ దేశాల ఆర్థిక బలం దాదాపు రెండింతల వేగంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

వివరాలు 

ఆవిష్కరణలకు కీలక కేంద్రాలుగా..

బ్రిక్స్‌ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, సమస్యలకు పరిష్కారాలను అందించే ముఖ్యమైన కేంద్రాలుగా ఎదుగుతున్నాయని మోదీ అన్నారు.

అట్టడుగు స్థాయి ప్రజాప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు అనేక రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు.

సాంకేతికత, ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలకు బ్రిక్స్‌ దేశాల్లో లభిస్తున్న ప్రాధాన్యం.. భవిష్యత్తులో వాటి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు.

ఈ దేశాల్లో అభివృద్ధి స్థాయి, పురోగతి వేగం, భవిష్యత్తుపై ఆశావాదం స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

సహకారం మరింత విస్తరించాలి

ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో బ్రిక్స్‌ సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ సూచించారు.

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రస్తుత సమావేశం ఇప్పటివరకు నిర్వహించిన బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌లలోనే అతిపెద్దదని తెలిపారు.

వివిధ దేశాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక వర్గాలు ఒకే వేదికపైకి రావడం ద్వారా కొత్త అవకాశాలకు మార్గం సుగమమవుతుందని మోదీ అన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సాంకేతిక సహకారం మరింత బలోపేతం కావడానికి ఈ సమావేశం దోహదపడుతుందని పేర్కొన్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్రిక్స్‌ దేశాల ఉమ్మడి జీడీపీ నాలుగున్నర రెట్లు పెరిగింది: ప్రధాని

ADVERTISEMENT