NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు 
    తదుపరి వార్తా కథనం
    కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు 
    కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్

    కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 22, 2023
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సోమవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

    కాంగ్రెస్ టిక్కెట్ కోసం రేఖానాయక్ ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో వేడి రాజేస్తోంది.

    ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్ స్థానంలో ఎన్ఆర్ఐ, జాన్సన్ రాథోడ్ నాయక్‌కు గులాబి అధిష్టానం టిక్కెట్ ఖరారు చేసింది.

    ఇప్పటికే ఆమె భర్త శ్యామ్ నాయక్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

    శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్‌లో పోటీ చేసేందుకు స్వయంగా దరఖాస్తు సమర్పించగా, ఎమ్మెల్యే రేఖా తరఫున ఆమె పీఏ గాంధీభవన్ లో దరఖాస్తు అందజేశారు.

    DETAILS

    ఇప్పటికీ బీఆర్ఎస్ క్యాడర్ నాతోనే ఉంది : రేఖానాయక్

    కచ్చితంగా తాను ఎన్నికల బరిలో ఉంటానని రేఖా తేల్చి చెప్పారు. ఇప్పటికీ బీఆర్ఎస్ క్యాడర్ తనతోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న 50 రోజులు నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై గళమెత్తుతానన్నారు.

    మంత్రి పదవి రేసులో ఉన్న కారణంగానే కుట్రలతో తప్పించారన్నారు. బీఆర్ఎ‌స్‌లో కేవలం అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. జాన్సన్ నాయక్ ఎస్టీ కాదని ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అని రేఖా ఆరోపణలు గుప్పిస్తున్నారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు రేఖా వర్గం చెబుతోంది.

    మరోవైపు గాంధీభవన్‌కు ధరఖాస్తు‌లు వెల్లువెత్తుతున్నాయి.అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్న వారి నుంచి పార్టీ ధరఖాస్తు‌లను స్వీకరిస్తోంది. ఈ మేరకు 5 రోజుల్లోనే దాదాపుగా 280 ధరఖాస్తులు వచ్చినట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    బీఆర్ఎస్
    ఎమ్మెల్యే

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కాంగ్రెస్

    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ ప్రతిపక్షాలు
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్
    కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత కేరళ
    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు ప్రతిపక్షాలు

    బీఆర్ఎస్

    సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ

    ఎమ్మెల్యే

    నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం నాగాలాండ్
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు కర్ణాటక
    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఉత్తర్‌ప్రదేశ్
    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025