NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు 
    తదుపరి వార్తా కథనం
    కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు 
    కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు

    కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు 

    వ్రాసిన వారు Stalin
    Oct 18, 2023
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 సంవత్సరానికి గోధుమలతో సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది.

    కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు.

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచింది. దీంతో మొత్త డీఏ 46 శాతానికి పెరిగింది.

    దీని ద్వారా 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ పెంపుదల జరిగింది.

     ధర

    ఆరు పంటలకు ఎంఎస్పీ పెంపు

    2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధికంగా, కేబినెట్ 2024-25 ఏడాదికి గాను గోధుమల ఎంఎస్‌పీని క్వింటాల్‌కు రూ.150పెంపుదలకు ఆమోదం తెలిపింది.

    దీంతో క్వింటాల్‌కు ధర రూ. 2,275కి పెంచింది. రేప్‌సీడ్‌, ఆవాలు క్వింటాల్‌కు రూ.200, మసూర్‌ క్వింటాల్‌కు రూ.425, బార్లీ క్వింటాల్‌కు రూ.115, పొద్దుతిరుగుడు క్వింటాల్‌కు రూ.150, మినుము క్వింటాల్‌కు రూ.105 చొప్పున పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

    లడఖ్‌లో 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

    2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ విద్యుత్తును తరలించే ట్రాన్స్‌మిషన్ లైన్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మీదుగా హర్యానాలోని కైతాల్ వరకు వెళుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర కేబినెట్
    పండగ
    అనురాగ్ సింగ్ ఠాకూర్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కేంద్ర కేబినెట్

    సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం  వంటగ్యాస్ సిలిండర్

    పండగ

    సంక్రాంతి: పండగ విశిష్టత, ప్రాముఖ్యత, జరుపుకునే విధానాలు సంక్రాంతి
    వసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి రెసిపీస్
    ఆది మహోత్సవం: ప్రధాని మోదీ ప్రారంభించిన గిరిజనుల పండగ గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మహాశివరాత్రి పండగ రోజు ఉపవాసం ఉన్నవారు తినగలిగే ఆహారాలు పండగలు

    అనురాగ్ సింగ్ ఠాకూర్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ రెజ్లింగ్
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ రెజ్లింగ్
    వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు గ్యాస్
    రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్  రెజ్లింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025