తదుపరి వార్తా కథనం

Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jun 11, 2025
10:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
అధికారికంగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖల బాధ్యతలు అప్పగించగా, గడ్డం వివేక్కు కార్మిక శాఖతో పాటు మైనింగ్ శాఖ కూడా ఇచ్చారు.
ఇక వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థక శాఖలు కేటాయించారు. ఈ తాజా కేబినెట్ విస్తరణతో రాష్ట్ర మంత్రిమండలిలో సభ్యుల సంఖ్య 15కు చేరింది.
ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నుంచే ఈ కొత్త మంత్రులకు బాధ్యతలు అప్పగించారని ప్రభుత్వం స్పష్టం చేసింది.