E20 Fuel: E20 ఇంధనంపై కొత్త చర్చ.. వర్షాల సమయంలో నీటి కలుషితం జరిగే అవకాశముందా?
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా E20 ఇంధనాన్ని (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్) ప్రామాణిక ఇంధనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో తాజాగా మరో చర్చ మొదలైంది. ముఖ్యంగా వర్షాకాలం, తీర ప్రాంతాల్లో E20 నిల్వలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు పెట్రోల్ బంక్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ది హిందూ కథనం ప్రకారం, ఎథనాల్కు తేమను ఆకర్షించే (హైగ్రోస్కోపిక్) స్వభావం ఉండటంతో వర్షాకాలంలో భూగర్భ ఇంధన ట్యాంకుల్లోకి చేరే నీరు లేదా తేమ కారణంగా E20 ఇంధనం కలుషితం అయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న భూగర్భ నిల్వ ట్యాంకులు సాధారణ పెట్రోల్ కోసం రూపొందించబడినవే గానీ, అధిక ఎథనాల్ మిశ్రమాల కోసం ప్రత్యేకంగా తయారు చేయలేదని పేర్కొన్నారు.
వివరాలు
ట్యాంకు అడుగుభాగంలో నీరు-ఎథనాల్ మిశ్రమం
పరిశ్రమకు చెందిన ఓ నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం,వర్షాల సమయంలో నీరు చొరబడటం, తేమ,ఘనీభవనం లేదా ఇంధనం తీసుకొచ్చే ట్యాంకర్ల ద్వారా కూడా కొద్దిపాటి నీరు భూగర్భ ట్యాంకుల్లోకి చేరే అవకాశం ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో E20 నిల్వల్లో నీటి శాతం 0.5శాతానికి మించి పెరిగితే,ఎథనాల్ నీటితో కలిసిపోతుంది.
దీంతో 'ఫేజ్ సెపరేషన్' అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే నీరు-ఎథనాల్ మిశ్రమం ట్యాంకు అడుగుభాగంలో చేరిపోతుంది.
పెట్రోల్ మాత్రం పైభాగంలో వేరుగా నిలుస్తుంది.పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని పంపిణీ చేసే పైపులు ట్యాంకు అడుగుభాగం నుంచే ఇంధనాన్ని తీసుకుంటాయి.
దీంతో కొన్ని సందర్భాల్లో వాహనాలకు సాధారణ E20 బదులుగా నీరు ఎక్కువగా ఉన్న ఎథనాల్ మిశ్రమం వెళ్లే అవకాశం ఉందని బంక్ యజమానులు చెబుతున్నారు.
వివరాలు
నీరు లోపలికి చేరి E20 ఇంధనాన్ని మరింత ప్రభావితం చేసే అవకాశం
అలా జరిగితే వాహనాలు స్టార్ట్ కాకపోవడం, కొంత దూరం వెళ్లిన తర్వాత మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందని తెలిపారు.
వినియోగదారులు ఫిర్యాదు చేసిన తర్వాతే ఇంధనం కలుషితమైన విషయం తమకు తెలుస్తుందని ఒక బంక్ యజమాని వెల్లడించారు.
తీర ప్రాంతాల్లో భూగర్భ జలాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో, నిల్వ ట్యాంకుల సీల్స్ సరిగా లేకపోతే నీరు లోపలికి చేరి E20 ఇంధనాన్ని మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
అలాగే మైల్డ్ స్టీల్తో తయారైన భూగర్భ ట్యాంకులు, పైపులు ఎథనాల్ తేమను ఆకర్షించే స్వభావం కారణంగా తుప్పు పట్టే ప్రమాదం కూడా పెరగవచ్చని కొందరు యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
ఫ్యాక్ట్ చెక్ ఏమంటోంది?
అయితే E20 వినియోగానికి అనుగుణంగా చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) ఇప్పటికే ఇంధన పంపిణీ యంత్రాల్లోని సీల్స్, వాషర్లను నియోప్రిన్ రబ్బర్తో మార్చినట్లు వారు తెలిపారు.
ఈ అంశంపై గతంలో ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) స్పందించింది.
E20 ఇంధనం వల్లే ప్రత్యేకంగా నీటి కలుషితం జరుగుతుందనే ప్రచారం తప్పుదారి పట్టించేదని స్పష్టం చేసింది.
ఎథనాల్ తేమను ఆకర్షించడం దాని సహజ లక్షణమేనని, అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ఇంధన ప్రమాణాలు,నిల్వ విధానాలు, వాహనాల రూపకల్పన ఇప్పటికే రూపొందించబడినట్లు తెలిపింది.
భారత్లో సరఫరా చేస్తున్న E20 ఇంధనం కఠినమైన BIS ప్రమాణాలకు అనుగుణంగానే ఉంటుందని పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
FADA_India చేసిన ట్వీట్
Myth: E20 causes water contamination unique to ethanol-blended petrol. ❌
— FADA (@FADA_India) July 11, 2026
Fact: Misleading. Ethanol's moisture absorption is a known property accounted for in fuel standards, storage, and vehicle design. India's E20 meets stringent BIS specifications.#FADA #E20 #MythVsFact pic.twitter.com/JPWXTAkxNx
వివరాలు
స్పందించిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అదే సమయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది.
ఎలాంటి ఇంధనమైనా సరే ఫ్యూయల్ ట్యాంకులోకి నీరు చేరడం మంచిది కాదని తెలిపింది.
అయితే ఆధునిక వాహనాల్లో నీరు ఫ్యూయల్ ట్యాంకులోకి చేరకుండా ప్రత్యేక భద్రతా వ్యవస్థలు, డిజైన్ ఫీచర్లు ఇప్పటికే ఉన్నాయని స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ
Sustainable fuel begins with sustainable production.
— Ministry of Information and Broadcasting (@MIB_India) July 4, 2026
Modern #ethanol distilleries use water-efficient processes and recycling technologies, making ethanol production far more resource-efficient than commonly perceived.#E20 #CleanMobility #EnergySecurity pic.twitter.com/CVeTwxTJ0U
వివరాలు
దేశంలోని కీలక ఇంధన విధానాల్లో ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఒకటి
భారత్లో అమలు చేస్తున్న ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమం దేశంలోని కీలక ఇంధన విధానాల్లో ఒకటి.
దిగుమతి ఇంధనాలపై ఆధారపడటం తగ్గించడం, రైతులకు మద్దతు ఇవ్వడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.
దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో E20ను ప్రామాణిక ఇంధనంగా విక్రయించడం ప్రారంభమైన తర్వాత పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ 2026 జూన్ 23న విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలపై వివరణ ఇచ్చింది.
అలాగే 2026 జూలై 4న జరిగిన మీడియా సమావేశంలో ఆటోమొబైల్ తయారీ సంస్థలు కూడా E20పై స్పష్టత ఇచ్చాయి.