NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Harsha Sai: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయిపై కేసు.. అరెస్టు తప్పదా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Harsha Sai: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయిపై కేసు.. అరెస్టు తప్పదా?
    బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయిపై కేసు.. అరెస్టు తప్పదా?

    Harsha Sai: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయిపై కేసు.. అరెస్టు తప్పదా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 16, 2025
    01:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

    ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదవ్వగా, తాజాగా మరో యూట్యూబర్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

    సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

    హర్ష సాయి అనేక సెక్షన్ల కింద బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు కేసు నమోదైనట్లు తెలిపారు.

    Details

    బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై సజ్జనార్ హెచ్చరిక 

    తాను మొత్తం బెట్టింగ్ మాఫియాతోనే పోరాడుతున్నానని సజ్జనార్ స్పష్టం చేశారు.

    కొంత మంది సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను ఉపయోగించి స్వలాభం కోసం బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారని, అందువల్ల అమాయకులు మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

    ప్రజలు ఈజీ మనీ వలలో పడకుండా, కష్టపడి సంపాదించాలని సూచించారు.

    Details

    హర్ష సాయి తప్పుడు వాదనలు

    హర్ష సాయి తనను సమర్థించుకునేందుకు, తాను ప్రమోట్ చేయకపోతే, ఎవరో చేస్తారని తప్పుడు వాదన వినిపిస్తున్నారని, ఇది సరైన ధోరణి కాదని సజ్జనార్ మండిపడ్డారు.

    అంతేగాక ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారని వింటున్నామని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో ఆలోచించాలన్నారు.

    మీరు ఫాలో చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు మీ ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారన్నారు. ఇలాంటి వారిని వెంటనే అన్‌ఫాలో చేసి, వారి అకౌంట్లను రిపోర్ట్ చేయాలన్నారు.

    ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాను అంతమొందించడంలో ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సజ్జనార్ సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సోషల్ మీడియా

    తాజా

    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం పాకిస్థాన్
    Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ  గౌతమ్ అదానీ
    Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  పాకిస్థాన్
    Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు  పాకిస్థాన్

    సోషల్ మీడియా

    వీధి వ్యాపారీ ముఖంలో చిరునవ్వు తెప్పించిన కళాకారుడు: వీడియో వైరల్  బెంగళూరు
    రెజ్లర్ల నిరసనలో ఖాప్ నేతల మధ్య  వాగ్యుద్ధం; వీడియో వైరల్  రెజ్లింగ్
    5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్  ఉద్యోగుల తొలగింపు
    ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్  మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025