Loading...
Kirlampudi: కిర్లంపూడి పీఎస్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసుల కేసు నమోదు
కిర్లంపూడి పీఎస్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసుల కేసు నమోదు

Kirlampudi: కిర్లంపూడి పీఎస్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసుల కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌లో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం,ముద్రగడ పద్మనాభంకు గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తున్న సమయంలో అంబటి రాంబాబు, ఆయన అనుచరులు విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని తోసివేశారని ఆరోపించారు.

వివరాలు 

అధికారిక విధుల నిర్వహణకు అంతరాయం

దీంతో పోలీసుల విధులకు ఆటంకం ఏర్పడిందని పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఏఆర్ ఎస్ఐ వెలుదూటి అప్పలరాజుతో పాటు పలువురు కానిస్టేబుళ్లు కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉన్నతాధికారులు సమక్షంలోనే ఉద్దేశపూర్వకంగా తమను తోసివేసి, అధికారిక విధుల నిర్వహణకు అంతరాయం కలిగించారని ఫిర్యాదులో వివరించినట్లు సమాచారం.

ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు అంబటి రాంబాబు సహా మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ADVERTISEMENT