NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kaushik Reddy: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి: కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ 
    తదుపరి వార్తా కథనం
    Kaushik Reddy: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి: కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ 
    టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి

    Kaushik Reddy: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి: కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 14, 2025
    05:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్రూప్‌-1 పరీక్షలో చోటుచేసుకున్న అన్యాయాలపై సీబీఐ విచారణ జరిపించాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

    టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.

    ప్రిలిమ్స్,మెయిన్స్ పరీక్షల కోసం వేర్వేరు హాల్‌టికెట్లు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు.

    కౌశిక్ రెడ్డి పేర్కొనడం ప్రకారం, కోఠి కళాశాలలోని 18వ మరియు 19వ సెంటర్లలో మొత్తం 1,490 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, వారిలో 74 మంది ఎంపికయ్యారు. అదే సమయంలో, 25 ఇతర పరీక్ష కేంద్రాల్లో 10,000 మంది పరీక్ష రాస్తే కేవలం 69 మందికే ఎంపిక లభించింది.

    ఈ పరిస్థితుల్లో 654 మందికి ఒకే విధమైన మార్కులు రావడం అనుమానాస్పదమని ఆయన విమర్శించారు.

    వివరాలు 

    గ్రూప్-1 పరీక్షలపై భాజపా నాయకులు స్పందించాలి  

    ఇక మరో విషయంగా,ఓ కాంగ్రెస్ నేత కోడలికి ఎస్టీ కేటగిరీలో మొదటి ర్యాంకు వచ్చిందని,ఆమె కూడా కోఠి కళాశాలలోనే పరీక్ష రాశారని కౌశిక్ రెడ్డి తెలిపారు.

    ఉర్దూ మాధ్యమంలో పరీక్ష రాసిన 9మందిలో ఏకంగా ఏడుగురు ఎంపికయ్యారని,టాప్ 100లో ఉర్దూ మాధ్యమానికి చెందిన ముగ్గురు ఉన్నారని చెప్పారు.

    మరోవైపు,తెలుగులో పరీక్ష రాసిన 8 వేల మంది అభ్యర్థుల్లో కేవలం 60మంది మాత్రమే ఎంపికయ్యారని,టాప్ 100లో నలుగురే ఉన్నారని వివరించారు.

    గ్రూప్-1 పరీక్షలపై భాజపా నాయకులు ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు.

    భారాస ప్రభుత్వంలో పేపర్ లీక్ జరిగితే వెంటనే పరీక్షలను రద్దు చేశామని గుర్తు చేశారు.

    అదే సమయంలో,కాంగ్రెస్ పాలనలో లీక్ జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్
    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్

    తెలంగాణ

    #NewsBytesExplainer: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఏమిటి? భారతదేశం
    LRS SUBSIDY: తెలంగాణ ప్రజలకు గుడ్​న్యూస్ - ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ పొడిగింపు - చివరి తేదీ ఎప్పుడంటే? భారతదేశం
    TG High court: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టు కీలక నిర్ణయం! హైకోర్టు
    Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుమతిస్తే.. మోదీకి మహాసభతో సన్మానం: సీఎం రేవంత్‌ రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025