Page Loader
Kaushik Reddy: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి: కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ 
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి

Kaushik Reddy: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి: కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2025
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రూప్‌-1 పరీక్షలో చోటుచేసుకున్న అన్యాయాలపై సీబీఐ విచారణ జరిపించాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ప్రిలిమ్స్,మెయిన్స్ పరీక్షల కోసం వేర్వేరు హాల్‌టికెట్లు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి పేర్కొనడం ప్రకారం, కోఠి కళాశాలలోని 18వ మరియు 19వ సెంటర్లలో మొత్తం 1,490 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, వారిలో 74 మంది ఎంపికయ్యారు. అదే సమయంలో, 25 ఇతర పరీక్ష కేంద్రాల్లో 10,000 మంది పరీక్ష రాస్తే కేవలం 69 మందికే ఎంపిక లభించింది. ఈ పరిస్థితుల్లో 654 మందికి ఒకే విధమైన మార్కులు రావడం అనుమానాస్పదమని ఆయన విమర్శించారు.

వివరాలు 

గ్రూప్-1 పరీక్షలపై భాజపా నాయకులు స్పందించాలి  

ఇక మరో విషయంగా,ఓ కాంగ్రెస్ నేత కోడలికి ఎస్టీ కేటగిరీలో మొదటి ర్యాంకు వచ్చిందని,ఆమె కూడా కోఠి కళాశాలలోనే పరీక్ష రాశారని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఉర్దూ మాధ్యమంలో పరీక్ష రాసిన 9మందిలో ఏకంగా ఏడుగురు ఎంపికయ్యారని,టాప్ 100లో ఉర్దూ మాధ్యమానికి చెందిన ముగ్గురు ఉన్నారని చెప్పారు. మరోవైపు,తెలుగులో పరీక్ష రాసిన 8 వేల మంది అభ్యర్థుల్లో కేవలం 60మంది మాత్రమే ఎంపికయ్యారని,టాప్ 100లో నలుగురే ఉన్నారని వివరించారు. గ్రూప్-1 పరీక్షలపై భాజపా నాయకులు ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు. భారాస ప్రభుత్వంలో పేపర్ లీక్ జరిగితే వెంటనే పరీక్షలను రద్దు చేశామని గుర్తు చేశారు. అదే సమయంలో,కాంగ్రెస్ పాలనలో లీక్ జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.