NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు
    భారతదేశం

    'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు

    'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 22, 2022, 04:22 pm 1 నిమి చదవండి
    'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు
    కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం

    దేశంలోని కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఉభయ సభల్లో కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, తదనుగుణంగా చర్యలు తీసుకుటుందని చెప్పారు. రానున్నవి పండగ రోజులని, ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదువుతున్న కేసులను బట్టి.. సగటున రోజుకు 153 కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నట్లు మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 5.87 లక్షల కేసులు నమోదవుతున్నాయన్నారు. దేశంలో ఇప్పటివరకు 220 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తయినట్లు పేర్కొన్నారు.

    'దేశంలో కేసులు అదుపులోనే..'

    అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్‌ శాంపిల్స్‌ సేకరణ మొదలుపెట్టినట్లు మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు కట్టుబడి ఉన్నామని, తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పండగలు, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రజలు మాస్క్‌లు ధరించేలా, శానిటైజర్‌లను ఉపయోగించేలా, సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కరోనా కొత్త వేరియంట్‌ను సకాలంలో గుర్తించడానికి జీనోమ్-సీక్వెన్సింగ్‌ను పెంచాలని రాష్ట్రాలకు మంత్రి మాండవియా సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నా.. దేశంలో మాత్రం అదుపులోనే ఉన్నాయన్నారు. చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, మరణాలను నిశీతంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కోవిడ్

    తాజా

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ

    కోవిడ్

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నరేంద్ర మోదీ
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన భారతదేశం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023