NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు
    తదుపరి వార్తా కథనం
    'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు
    కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం

    'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు

    వ్రాసిన వారు Stalin
    Dec 22, 2022
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఉభయ సభల్లో కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, తదనుగుణంగా చర్యలు తీసుకుటుందని చెప్పారు. రానున్నవి పండగ రోజులని, ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.

    ప్రపంచవ్యాప్తంగా నమోదువుతున్న కేసులను బట్టి.. సగటున రోజుకు 153 కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నట్లు మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 5.87 లక్షల కేసులు నమోదవుతున్నాయన్నారు. దేశంలో ఇప్పటివరకు 220 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తయినట్లు పేర్కొన్నారు.

    కరోనా

    'దేశంలో కేసులు అదుపులోనే..'

    అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్‌ శాంపిల్స్‌ సేకరణ మొదలుపెట్టినట్లు మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు కట్టుబడి ఉన్నామని, తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పండగలు, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రజలు మాస్క్‌లు ధరించేలా, శానిటైజర్‌లను ఉపయోగించేలా, సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు.

    కరోనా కొత్త వేరియంట్‌ను సకాలంలో గుర్తించడానికి జీనోమ్-సీక్వెన్సింగ్‌ను పెంచాలని రాష్ట్రాలకు మంత్రి మాండవియా సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నా.. దేశంలో మాత్రం అదుపులోనే ఉన్నాయన్నారు. చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, మరణాలను నిశీతంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్

    తాజా

    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ
    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025