NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Simhachalam Temple: ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Simhachalam Temple: ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం 
    ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం

    Simhachalam Temple: ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2025
    08:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

    అదే రోజున స్వామివారు భక్తులకు నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

    చైత్ర బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న సింహగిరిలోని దేవస్థానంలో తొలి గంధం తయారీకి శుభారంభం చేయనున్నారు.

    ఉదయం 6.30 గంటలకు అర్చకులు చందనం తయారీకి ముహూర్తం నిర్ణయించినట్లు ఈవో సుబ్బారావు వెల్లడించారు.

    అదే రోజు ఉదయం 7.30 తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం అందుబాటులోకి రానున్నది.

    వివరాలు 

     120 కిలోల చందనాన్ని స్వామికి అంకితం 

    చందనోత్సవం సందర్భంగా వైశాఖ శుద్ధ తదియన స్వామివారి నిజరూప దర్శనం అనంతరం, తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని స్వామివారికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

    మూడు మణుగులు అంటే సుమారుగా 120 కిలోల చందనాన్ని అంకితమిస్తారు.

    ఈ చందనాన్ని ఆలయంలోని బేడామండపంలో సానలపై అర్చకులు అరగదీస్తారు.

    తరువాత, ఆ గంధంలో సుగంధ ద్రవ్యాలు కలిపి, ఈ నెల 30న రాత్రి సహస్ర ఘటాభిషేకం ముగిసిన తర్వాత స్వామివారికి అర్పణ చేస్తారు.

    ఈ కార్యక్రమం తరువాత కూడా వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణముల సందర్భాల్లో మిగిలిన మూడు విడతలుగా చందన సమర్పణ జరుగుతుంటుంది.

    చివరగా శ్రావణ పౌర్ణమికి కరాళ చందన అలంకరణతో ఈ ఉత్సవం ముగియనుంది.

    వివరాలు 

    దర్శనానికి సుమారు 1.50 లక్షల మంది భక్తులు

    స్వామివారి నిజరూప దర్శన దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనుంది.

    ఇందుకోసం దేవాదాయశాఖ కార్యదర్శి రూ.20,000మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

    ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకోనున్నారని అధికారులు తెలిపారు.

    ఈసారి నిజరూప దర్శనానికి సుమారు 1.50 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నారు.

    అందుకు అనుగుణంగా విస్తృత స్థాయిలో భద్రతా చర్యలు,ఇతర ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.

    ఉదయం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

    ఈఏడాది ప్రత్యేకతగా,ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇవ్వాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    విశాఖపట్టణం

    TCS in Vizag: విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు.. 10 వేల మందికి ఉపాధి  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
    Nuclear Missile: నౌకాదళం నాల్గవ న్యూక్లియర్‌ పవర్డ్ బాలిస్టిక్‌ మిస్సైల్ జలాంతర్గామిని ఆవిష్కరించిన భారత్  టెక్నాలజీ
    Narayana: కేంద్రం అనుమతులిచ్చిన వెంటనే విశాఖ మెట్రో పనులు : మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్
    Glass Skywalk Bridge : విశాఖలో కొత్త టూరిజం అట్రాక్షన్.. కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ వంతెన పర్యాటకం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025