NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు
    భారతదేశం

    కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు

    కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 05, 2023, 03:55 pm 1 నిమి చదవండి
    కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు
    సీఎం జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

    కుప్పంలోని టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. కుప్పంలో తన పర్యటనకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్‌ జగన్‌ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై స్పందించిన చంద్రబాబు.. టీడీపీ సమావేశాలకు రాకుండా చేసే కుట్రల్లో భాగంగానే అవి జరిగాయన్నారు.

    'నేను తల్చుకుంటే జగన్ పాదయాత్ర చేసేవారా?'

    తప్పుడు కేసులు పెట్టి తమను అడ్డుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, జగన్ పాదయాత్ర చేశారన్నారు. వారి పాదయాత్ర కోసం తాను భద్రత కూడా కల్పించానన్నారు. తాను తల్చుకుంటే నాడు జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలోనే తనను అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు ఘటనల అనంతరం రాష్ట్రంలో రోడ్ షోలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. అయినా పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబుకు పోలీసు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్
    చిత్తూరు
    కుప్పం

    తాజా

    నిఖత్ జరీన్ గోల్డన్ పంచ్.. రెండోసారి టైటిల్ కైవసం బాక్సింగ్
    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో

    చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస నారా లోకేశ్
    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    ఆంధ్రప్రదేశ్

    వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ ఉద్యోగం
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఉద్యోగం

    చిత్తూరు

    కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు చంద్రబాబు నాయుడు

    కుప్పం

    లోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023