NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు
    తదుపరి వార్తా కథనం
    కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు
    సీఎం జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

    కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు

    వ్రాసిన వారు Stalin
    Jan 05, 2023
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కుప్పంలోని టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.

    కుప్పంలో తన పర్యటనకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు.

    వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్‌ జగన్‌ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై స్పందించిన చంద్రబాబు.. టీడీపీ సమావేశాలకు రాకుండా చేసే కుట్రల్లో భాగంగానే అవి జరిగాయన్నారు.

    సీఎం జగన్

    'నేను తల్చుకుంటే జగన్ పాదయాత్ర చేసేవారా?'

    తప్పుడు కేసులు పెట్టి తమను అడ్డుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, జగన్ పాదయాత్ర చేశారన్నారు. వారి పాదయాత్ర కోసం తాను భద్రత కూడా కల్పించానన్నారు. తాను తల్చుకుంటే నాడు జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలోనే తనను అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు.

    కందుకూరు, గుంటూరు ఘటనల అనంతరం రాష్ట్రంలో రోడ్ షోలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. అయినా పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబుకు పోలీసు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్
    కుప్పం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    చంద్రబాబు నాయుడు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు భారతదేశం
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ భారతదేశం
    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ వై.ఎస్.జగన్
    2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే.. భారతదేశం

    కుప్పం

    కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025