NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / G20 Summit: జీ20 సమ్మిట్ వేళ.. థియేటర్లు తెరుస్తారా? మార్నింగ్ వాక్ చెయొచ్చా? దిల్లీలో ఆంక్షలు ఇవే.. 
    తదుపరి వార్తా కథనం
    G20 Summit: జీ20 సమ్మిట్ వేళ.. థియేటర్లు తెరుస్తారా? మార్నింగ్ వాక్ చెయొచ్చా? దిల్లీలో ఆంక్షలు ఇవే.. 
    జీ20 సమ్మిట్ వేళ.. థియేటర్లు తెరుస్తారా? మార్నింగ్ వాక్ చెయొచ్చా? దిల్లీలో ఆంక్షలు ఇవే..

    G20 Summit: జీ20 సమ్మిట్ వేళ.. థియేటర్లు తెరుస్తారా? మార్నింగ్ వాక్ చెయొచ్చా? దిల్లీలో ఆంక్షలు ఇవే.. 

    వ్రాసిన వారు Stalin
    Sep 04, 2023
    03:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో సెప్టెంబర్ 9, 10తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు ప్రపంచదేశాల నుంచి నాయకులు వస్తున్నారు.

    దిల్లీ నిర్వహిస్తున్న ఈ హై-ప్రొఫైల్ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లును చేసింది. అలాగే నిర్దేశిత ప్రాంతాల్లో ఆంక్షలను విధించింది.

    ముఖ్యంగా ట్రాఫిక్ సజావుగా ఉండేలా ప్రత్యేక రెగ్యులేటరీ జోన్‌లను పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జీ20 సదస్సు వేళ.. దిల్లీలో విధించిన ఆంక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి నుంచే నిర్దేశిత ప్రాంతాల్లో దిల్లీలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ పైనే ఆంక్షల ప్రభావం పడనుంది. నార్తర్న్ జోన్‌లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

    దిల్లీ

    థియేటర్లు, రెస్టారెంట్లు బంద్ 

    సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జీ20 సమ్మిట్ నిర్వహిస్తారు. దీంతో దిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఈ రెండు రోజులు సెలవు ప్రకటించారు.

    అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరిగే అవకాశం ఉన్న కొన్ని సున్నితమైన ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో భద్రతపై నిఘా పెట్టనున్నారు.

    జీ20 సమ్మిట్ జరిగే రోజుల్లో దిల్లీలోని ఏ మార్కెట్ కూడా మూసివేయబడదని స్పెషల్ సీపీ(ట్రాఫిక్) సురేందర్ యాదవ్ తెలిపారు.

    నిర్దేశిత ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నన్ని రోజులు దిల్లీలోని అన్ని థియేటర్లు, రెస్టారెంట్లు మూసివేసి ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా క్లౌడ్ కిచెన్‌లు, డెలివరీ సేవలకు కూడా అనుమతి లేదన్నారు.

     దిల్లీ

    తెరుచుకునేవి ఇవే..

    కిరాణం దుకాణాలు, ఏటీఎంలు, మెడికల్ షాపులు, ఇతర అత్యవసర సేవలు అందించే సంస్థలు తెరిచి ఉంటాయని సురేందర్ యాదవ్ వెల్లడించారు.

    కొంతమంది దేశాధినేతలు సాకేత్‌లోని మౌర్య షెరటన్ హోటల్, లోధి హోటల్, రింగ్ రోడ్‌లోని హయత్‌లో బస చేస్తారని యాదవ్ చెప్పారు. ఇవన్నీ ఎన్‌డీఎంసీ పరిధిలో ఉన్నాయని, ఇవి సాధారణంగానే పనిచేస్తాయని చెప్పారు.

    అయితే ప్రముఖుల ప్రయాణాలు ఉన్నప్పుడు 5స్టార్ హోటళ్ల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పారు.

    అలాగే నిర్దేశిత ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో అన్ని మాల్స్, హోటళ్లు సాధారణంగా పనిచేస్తాయని చెప్పారు.

    నియంత్రిత జోన్‌లో కార్లు, సైకిళ్లు, ఇతర వాహనాలకు అనుమతి లేదని సురేందర్ యాదవ్ వివరించారు. సమ్మిట్ వ్యవధిలో మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లవద్దని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సదస్సు
    దిల్లీ
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    జీ20 సదస్సు

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  దిల్లీ
    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం  జీ20 సమావేశం
    వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం చైనా

    దిల్లీ

    Haryana violence: వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలి: సుప్రంకోర్టు సుప్రీంకోర్టు
    ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టు నోటీసులు.. వివరణ ఇవ్వాలని 26 విపక్షాలకు ఆదేశం  భారతదేశం
    నేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్‌ దిల్లీ సర్వీసెస్ బిల్లు
    Delhi AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది అగ్నిప్రమాదం

    తాజా వార్తలు

    Cooking Gas: గుడ్ న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్రం నిర్ణయం  వంటగ్యాస్ సిలిండర్
    ఎలాంటి చర్చ జరగకుండానే ముగిసిన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు  మణిపూర్
    'ఫస్ట్‌క్రై.కామ్' సీఈఓపై పన్ను ఎగవేత ఆరోపణలు.. ఐటీ శాఖ దర్యాప్తు  పన్ను
    ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్ల కోసం 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ .. 31వ తేదీ నుంచి అమలు  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025