జీ20 సదస్సు: వార్తలు
జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు?
జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగులపై మరో అప్టేట్ వచ్చింది.
జీ20 సదస్సులో విధులు నిర్వహించిన పోలీసులతో ప్రధాని మోడీ డిన్నర్
G20 సమ్మిట్ను విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరి సహకారాన్ని గుర్తించే ప్రయత్నంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారం ఢిల్లీ పోలీసు సిబ్బందితో విందు చేసే అవకాశం ఉంది.
BRI Exit Italy: జీ20 వేదికగా చైనాకు షాకిచ్చిన ఇటలీ
దిల్లీ జీ20 వేదికగా చైనాకు ఇటలీ షాకిచ్చింది. చైనా ప్రతిష్టాత్మికంగా భావించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) నుంచి తాము వైదొలగాలని భావిస్తున్నట్లు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ప్రకటించారు. చైనా ప్రధాని లీ కియాంగ్కు ఈ విషయాన్ని జార్జియా చెప్పినట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది.
G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ
దిల్లీ వేదికగా జరుగుతున్న రెండు రోజుల జీ20 సమావేశాలు ముగిసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
పుతిన్ను అరెస్టు చేసే ఉద్దేశం మాకు లేదు: బ్రెజిల్ అధ్యక్షుడు
వచ్చే ఏడాది బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జీ20 సదస్సు జరగనుంది. అయితే ఈ సమ్మిట్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్భయంగా రావొచ్చని ఆ దేశ అధ్యక్షుడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అన్నారు. ఆయన వస్తే తాము అరెస్టు చేయబోమని, ఆ ఉద్దేశం తమకు లేదన్నారు.
రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు
జీ20 సదస్సులో రెండో రోజులో భాగంగా ఆదివారం సభ్యదేశాల ప్రతినిధులు దిల్లీలోని రాజ్ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆదివారం ఉదయం దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
India-Middle East-Europe corridor: 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం
జీ20 సదస్సు వేదికగా చారిత్ర ఒప్పందం జరిగింది. వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ను ప్రారంభించారు.
G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన
జీ20 సదస్సు తొలి సెషన్లో కూటమిలోని దేశాధినేతలు దిల్లీ సమ్మిట్ డిక్లరేషన్పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఇది ప్రపంచానికి కొత్త దిశను చూపే సమయం: జీ20 స్వాగత ప్రసంగంలో ప్రధాని మోదీ
దిల్లీ ప్రగతి మైదాన్లోని 'భారత్ మండపం'లో జీ20 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత ప్రారంభమైంది. మోదీ ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.
G20 summit delhi: దిల్లీలో అట్టహాసంగా జీ20 సదస్సు.. దేశాధినేతలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ
జీ20 సదస్సు శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. శిఖరాగ్ర సమావేశానికి తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న భారత్ రాజధాని దిల్లీ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ప్రపంచ దేశాధినేతల రాకతో మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
భారత్ సరైన పనే చేసింది: రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత కేంద్రం వైఖరికి మాజీ ప్రధాని మద్దతు
భారతదేశం"తన సార్వభౌమత్వం,దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి మంచి పనిచేసిందని,అదే సమయంలో శాంతి శాంతిస్థాపన ఆవశ్యకతను ప్రస్తావించింది"అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.
జీ20 సమ్మిట్ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారం రోజుల పర్యటన నిమిత్త యూరప్కు బయలుదేరారు.
China roller spoiler: జీ20 సమ్మిట్లో చైనా పాత్రపై అమెరికా ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు
దిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్లో చైనా పాత్రపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్లెట్స్లో కేంద్రం
జీ20 సదస్సు వేళ.. 'భారత్, ద మదర్ ఆఫ్ డెమెక్రసీ', 'ఎలక్షన్స్ ఇన్ ఇండియా' పేరుతో రెండు బుక్లెట్స్ను కేంద్రం విడుదల చేసింది.
జీ20 సమ్మిట్ వేళ.. ఆన్లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్లు బంద్
జీ20 సదస్సు నేపథ్యంలో దిల్లీలో ఆన్లైన్ ఆర్డర్లు, ఇతర సేవలకు సంబంధించిన డెలివరీలపై పోలీసులు కీలక ప్రకటన చేశారు.
జిల్ బైడెన్ కరోనా పాజిటివ్.. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు వస్తారా?
మరో రెండు రోజుల్లో దిల్లీలో జరిగే జీ20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్కు బయలుదేరాల్సిన ఉండగా.. ఆయన పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
G20 Summit: జీ20 సమ్మిట్ వేళ.. థియేటర్లు తెరుస్తారా? మార్నింగ్ వాక్ చెయొచ్చా? దిల్లీలో ఆంక్షలు ఇవే..
దిల్లీలో సెప్టెంబర్ 9, 10తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్కు ప్రపంచదేశాల నుంచి నాయకులు వస్తున్నారు.
జీ20 సదస్సుకు చైనా ప్రధాని లీ కియాంగ్
సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ హాజరుకావడం లేదని బీజింగ్ సోమవారం ధృవీకరించింది.
'జీ20 సదస్సును అడ్డుకోండి'; కశ్మీరీ ముస్లింలకు ఖలిస్థానీ నేత పిలుపు
దిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సుపై ఖలిస్థానీ నాయకుడు, సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్లో స్థానం లేదు: ప్రధాని మోదీ
స్వాతంత్య్రం వచ్చి 100ఏళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో, 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న క్రమంలో భారత్లో అవినీతి, కులతత్వం, మతతత్వానికి స్థానం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక అంశాలపై మాట్లాడారు.
కారణం చెప్పకుండానే.. భారత్తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా
జీ20 సదస్సు ముంగిట కెనడా కీలక ప్రకటన చేసింది. భారత్తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్హౌస్ వెల్లడి
దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9,10తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ పాల్గొనేందుకు 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు.
G-20 SUMMIT- 2023: నాల్గోసారి భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్
అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ భారత్ రానున్నారు. దిల్లీ వేదికగా త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన జీ-20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు.
వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్పింగ్.. భారత్లో జరిగే G-20 సమావేశాలకు దూరం
G-20 శిఖరాగ్ర సమావేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. దిల్లీ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ కు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
జీ20 సమ్మిట్ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం
సెప్టెంబర్ 9,10 తేదీల్లో దిల్లీలో ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది.
India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?
భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరగనున్న జీ20 సదస్సుకు కేవలం 9రోజుల సమయం మాత్రమే ఉంది.
జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ
మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.