NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'జీ20 సదస్సును అడ్డుకోండి'; కశ్మీరీ ముస్లింలకు ఖలిస్థానీ నేత పిలుపు 
    తదుపరి వార్తా కథనం
    'జీ20 సదస్సును అడ్డుకోండి'; కశ్మీరీ ముస్లింలకు ఖలిస్థానీ నేత పిలుపు 
    'జీ20 సదస్సును అడ్డుకోండి'; కశ్మీరీ ముస్లింలకు ఖలిస్థానీ నేత పిలుపు

    'జీ20 సదస్సును అడ్డుకోండి'; కశ్మీరీ ముస్లింలకు ఖలిస్థానీ నేత పిలుపు 

    వ్రాసిన వారు Stalin
    Sep 04, 2023
    10:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సుపై ఖలిస్థానీ నాయకుడు, సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    కశ్మీర్ లోయలో నివసిస్తున్న ముస్లింలు దిల్లీకి వెళ్లి జీ20 సమ్మిట్‌కు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.

    దిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే.

    8వ తేదీన అంటే శుక్రవారం ప్రార్థనల తర్వాత శిఖరాగ్ర సమావేశం జరిగే ప్రగతి మైదాన్‌కు కవాతుగా వెళ్లాలని కశ్మీర్ లోయ ప్రజలను ఆయన కోరారు.

    అంతేకాకుండా దిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో ఖలిస్థానీ జెండాను ఎగురవేస్తానని వీడియో సందేశంలో హెచ్చరించారు.

    దిల్లీ

    దిల్లీ పోలీసులు అలర్ట్ 

    గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియో సందేశం నేపథ్యంలో దిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు.

    దిల్లీలోని మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాసిన తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.

    ఇదిలా ఉంటే, ఎస్ఎఫ్‌జేతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

    ఈ ఇద్దరే గురుపత్వంత్ సింగ్ ఆదేశాల మేరకు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాసినట్లు అధికారులు వెల్లడించారు.

    పశ్చిమ దిల్లీలోని పంజాబీ బాగ్, శివాజీ పార్క్, మాదిపూర్, పశ్చిమ్ విహార్, మహారాజా సూరజ్మల్ స్టేడియం, నాంగ్లోయ్ సహా మెట్రో స్టేషన్ల గోడలపై 'దిల్లీ బనేగా ఖలిస్థాన్' వంటి నినాదాలు నలుపు రంగులో స్ప్రే చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఖలిస్థానీ
    దిల్లీ
    జీ20 సదస్సు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఖలిస్థానీ

    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం బ్రిటన్
    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు పంజాబ్
    అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు పంజాబ్
    అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు పంజాబ్

    దిల్లీ

    దిల్లీ-ఎన్సీఆర్‌లో వీహెచ్‌పీ-బజరంగ్ దళ్ ర్యాలీలను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్  హర్యానా
    దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు  చంద్రబాబు నాయుడు
    Haryana violence: వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలి: సుప్రంకోర్టు సుప్రీంకోర్టు
    ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టు నోటీసులు.. వివరణ ఇవ్వాలని 26 విపక్షాలకు ఆదేశం  భారతదేశం

    జీ20 సదస్సు

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  జీ20 సమావేశం
    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం  జీ20 సమావేశం
    వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025