NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం 
    తదుపరి వార్తా కథనం
    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం 
    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచేవి ఏవి? మూసేవి ఏవో తెలుసుకుందాం

    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం 

    వ్రాసిన వారు Stalin
    Aug 30, 2023
    02:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెప్టెంబర్ 9,10 తేదీల్లో దిల్లీలో ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది.

    ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన భారత్‌ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో సమ్మిట్ జరగనుంది.

    జీ20కూటమిలోని దేశాధినేతలు సెప్టెంబర్ 8 నుంచే దిల్లీకి చేరుకోవడం ప్రారంభిస్తారు.

    దీంతో ఆరోజు నుంచే ఎలాంటి ఆటంకాలు కలగకుండా, వాతావరణం ప్రశాంతంగా ఉండేందుకు కేంద్రం అఫీసులు, పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.

    అలాగే ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించనున్నారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 8 నుంచే 10వ తేదీ వరకు అమలు కానున్నాయి.

    ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సెలవులకు సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేసింది.

    దిల్లీ

    ఏం తెరిచి ఉంటాయంటే?

    జీ20 సమ్మిట్ నేపథ్యంలో దిల్లీలో 8,9,10 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

    సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చు.

    దిల్లీ పోలీస్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న అన్ని వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మూడు రోజులు మూసివేస్తారు.

    దిల్లీ మెట్రో సేవలు పాక్షికంగా కొనసాగుతాయి. సుప్రీంకోర్టు, ఖాన్ మార్కెట్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రోస్టేషన్లను మూడు రోజుల పాటు మూసివేయనున్నారు.

    ఆసుపత్రులు, మెడికల్ స్టోర్లు, మిల్క్ బూత్‌లతో సహా కొన్ని అత్యవసర సేవలు తెరిచి ఉంటాయని అధికారులు చెప్పారు.

     దిల్లీ

    ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. 

    ట్రాఫిక్ పోలీసులు కార్గో ట్రక్కులను మూడు రోజుల పాటు దిల్లీ రాకుండా నిషేదం విధించారు. ముఖ్యమైన సరుకును తీసుకువెళ్లే వాహనాలకు మాత్రమే దిల్లీలో ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది.

    దిల్లీలో కొన్ని ప్రాంతాల్లో నిర్దిష్ట సమయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయి.

    ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి, వీవీఐపీల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆంక్షలను విధించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలో జారీ చేయనున్నారు.

    కొన్ని ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, మార్కెట్లు కూడా మూసివేయబడతాయి.

    వీవీఐపీ కదలికలు ఉన్న ప్రాంతాల్లో బస్సుల రాకపోకలను నిషేధిస్తారు.

    ఆసుపత్రి, అత్యవసర సేవలతో పాటు రైలు, విమానాల్లో ప్రయాణించే వారిపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సదస్సు
    జీ20 సమావేశం
    దిల్లీ
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    జీ20 సదస్సు

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  జీ20 సమావేశం

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  భారతదేశం
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  శ్రీనగర్
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  పర్యాటకం

    దిల్లీ

    అశ్లీల వీడియో కాల్ చేసి కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా.. ఇద్దరి అరెస్ట్ కేంద్రమంత్రి
    భారత వాతావరణ అంచనా వ్యవస్థలు ప్రపంచంలోనే భేష్  : కిరణ్ రిజిజు కేంద్ర ప్రభుత్వం
    దిల్లీల్లో మరికొన్ని రోజులు వర్షాలు; మళ్లీ ప్రమాద స్థాయికి యమునా నది భారీ వర్షాలు
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్

    తాజా వార్తలు

    69th National film awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు వరించింది వీరినే..   జాతీయ చలనచిత్ర అవార్డులు
    2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: అశోక్ గెహ్లాట్ రాహుల్ గాంధీ
    ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్‌ కాంగ్రెస్
    చంద్రయాన్ -3 మూడు లక్ష్యాల్లో రెండు పూర్తి.. ఆఖరి టార్గెట్‌పై మిషన్ ఫోకస్    చంద్రయాన్-3
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025