NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ 
    ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ

    G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Sep 10, 2023
    03:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ వేదికగా జరుగుతున్న రెండు రోజుల జీ20 సమావేశాలు ముగిసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

    ఈ క్రమంలో తదుపరి జీ20 అధ్యక్ష బాధ్యతలను మోదీ బ్రెజిల్‌కు అప్పగించారు. ఈ మేరకు మోదీ బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వాకు ప్రెసిడెన్సీ సూచిక అయిన గ్రావెల్‌ను అందజేశారు. అనంతరం మోదీ ఆయన్ను అభినందించారు.

    డిసెంబరు 1న బ్రెజిల్ అధికారికంగా జీ20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.

    ఈ సందర్భంగా లూలా డ సిల్వా మాట్లాడుతూ.. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల గళాన్ని వినిపించడానికి భారత్ చేస్తున్న కృషిని అభినందించారు. ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, స్థిరమైన అభివృద్ధి వంటి పలు అంశాలను ప్రధానంగా జీ20 జాబితాలో చేర్చనున్నట్లు లులా డ సిల్వా తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జీ20 సమావేశాలకు ముగింపు పలికిన మోదీ

    #WATCH | G 20 in India | Prime Minister Narendra Modi hands over the gavel of G 20 presidency to the President of Brazil Luiz Inácio Lula da Silva. pic.twitter.com/ihEmXN9lty

    — ANI (@ANI) September 10, 2023

    మోదీ

    నవంబర్‌లో జీ20 వర్చువల్ సెషన్‌: మోదీ 

    దిల్లీ జీ20 సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 'ప్రపంచంలో శాంతి నెలకొనాలి' అనే నినాదంతో ముగించారు. ఈ సందర్భంగా సదస్సులో చేసిన తీర్మానాలపై స్పందించారు.

    'వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్' అనేది జీ20కి రోడ్‌మ్యాప్‌గా మారినందుకు ఆనందంగా ఉందన్నారు. 2023 నవంబర్ వరకు భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలను కలిగి ఉందని మోదీ చెప్పారు.

    గత రెండు రోజులుగా వచ్చిన సలహాలను సమీక్షించడానికి నవంబర్‌లో వర్చువల్ సెషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సెషన్‌లో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు.

    మోదీ

    ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు అవసరం: మోదీ

    ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ సంస్థల్లో సంస్కరణల అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. కొత్త ప్రపంచ నిర్మాణంలో కొత్త ఆలోచనలు ప్రతిబింబించాలని మోదీ పిలుపునిచ్చారు.

    51మంది సభ్యులతో ఐక్యరాజ్య సమితి స్థాపించబడినప్పుడు ప్రపంచం భిన్నంగా ఉందన్నారు. ఇప్పుడు ఐరాసలో సభ్యదేశాల సంఖ్య 200‌కి పెరిగనట్లు పేర్కొన్నారు. కాలానుగుణంగా మారని వారు తమ ఔచిత్యాన్ని కోల్పోతారని ప్రకృతి ధర్మనం అని మోదీ అన్నారు.

    ఇదిలా ఉంటే, ఆదివారం సెషన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొనలేదు. ఆయన వియత్నాంకు వెళ్లడంతో చివరి రోజుకు గైర్హాజరయ్యారు. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద జీ20 నాయకులు ఆదివారం మహాత్మగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సమావేశం
    బ్రెజిల్
    నరేంద్ర మోదీ
    జీ20 సదస్సు

    తాజా

    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  తాజా వార్తలు
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  తాజా వార్తలు
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  తాజా వార్తలు

    బ్రెజిల్

    బ్రెజిల్‌లో విధ్వంసం: అధ్యక్ష భవనం తలుపు బద్ధలుకొట్టి బోల్సొనారో మద్దతుదారులు బీభత్సం అంతర్జాతీయం
    బ్రెజిల్: బోల్సోనారో మద్దతుదారుల 'మెగా నిరసన' అట్టర్ ప్లాప్ అంతర్జాతీయం
    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం ఇండియా
    బ్రెజిల్‌లో డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం.. పోలీస్ కాల్పుల్లో 9 మంది దుర్మరణం అంతర్జాతీయం

    నరేంద్ర మోదీ

    Vishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం  కేంద్ర ప్రభుత్వం
    జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ  జమ్ముకశ్మీర్
    Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు రాహుల్ గాంధీ
    BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ  బ్రిక్స్ సమ్మిట్

    జీ20 సదస్సు

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  జీ20 సమావేశం
    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం  జీ20 సమావేశం
    వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025