NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జీ20 సమ్మిట్‌ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ 
    తదుపరి వార్తా కథనం
    జీ20 సమ్మిట్‌ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ 
    జీ20 సమ్మిట్‌ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ

    జీ20 సమ్మిట్‌ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ 

    వ్రాసిన వారు Stalin
    Sep 06, 2023
    11:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారం రోజుల పర్యటన నిమిత్త యూరప్‌కు బయలుదేరారు.

    భారత్ ప్రతిష్టాత్మకమైన జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్న వేళ.. రాహుల్ యూరప్‌ పర్యటనకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా యూరోపియన్ యూనియన్ లాయర్లు, విద్యార్థులు, భారతీయ ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు.

    సెప్టెంబరు 7న బ్రస్సెల్స్‌లో ఈయూ న్యాయవాదుల బృందాన్ని రాహుల్ కలుస్తారని, హేగ్‌లో కూడా మరో సమావేశంలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

    సెప్టెంబర్ 8న పారిస్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించనున్నారు.

    రాహుల్

    సెప్టెంబరు 11న దిల్లీకి తిరిగి వచ్చే అవకాశం

    సెప్టెంబరు 9న పారిస్‌లో జరిగే లేబర్ యూనియన్ ఆఫ్ ఫ్రాన్స్ సమావేశంలోనూ రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. ఆ తర్వాత నార్వేలో పర్యటించి, సెప్టెంబర్ 10న ఓస్లోలో జరిగే డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొననున్నారు.

    జీ20 సమ్మిట్ ముగిసిన ఒక రోజు తర్వాత అంటే సెప్టెంబర్ 11 నాటికి రాహుల్ గాంధీ దిల్లీకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.

    సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలో జీ20 లీడర్స్ సమ్మిట్ జరగనుంది.

    ఈ సదస్సుకు 30 మందికి పైగా దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ ఆహ్వానిత దేశాల నుంచి ఉన్నతాధికారులు, 14 మంది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    తాజా వార్తలు
    జీ20 సదస్సు

    తాజా

    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్
    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్

    రాహుల్ గాంధీ

    బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఫిర్యాదు; ఎఫ్ఐఆర్ నమోదు  కాంగ్రెస్
    కేజీఎఫ్ కాపీ రైట్ కేసులో రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. పిటిషన్ కొట్టివేత కాంగ్రెస్
    మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్ అడ్డగింత.. ఎందుకో తెలుసా? మణిపూర్
    నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం  ఖమ్మం

    తాజా వార్తలు

    ఛత్తీస్‌గఢ్‌: అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్  ఛత్తీస్‌గఢ్
    ప్రముఖ హాస్యనటుడు ఆర్‌ఎస్ శివాజీ కన్నుమూత  కోలీవుడ్
    TVS: ఆగస్టులో 20వేలకు పైగా iQube మోడల్స్‌ను విక్రయించిన టీవీఎస్  బైక్
    Ind vs Pak: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. టీమిండియా 266 పరుగులకు ఆలౌట్  ఆసియా కప్

    జీ20 సదస్సు

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  జీ20 సమావేశం
    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం  దిల్లీ
    వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025