NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ 
    అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ

    అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Sep 03, 2023
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్వాతంత్య్రం వచ్చి 100ఏళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో, 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న క్రమంలో భారత్‌లో అవినీతి, కులతత్వం, మతతత్వానికి స్థానం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక అంశాలపై మాట్లాడారు.

    త్వరలో జరగనున్న జీ20 సదస్సు గురించి మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్ర‌పంచం ఇప్పుడు దిశానిర్దేశం కోసం భార‌త‌దేశం వైపు చూస్తోందన్నారు.

    ఈ సమావేశాల్లో భారత్ చెప్పే మాటలు కేవలం ఆలోచనలు మాత్రమే కాదని, అవి ప్రపంచ భవిష్యత్‌కు రూట్ మ్యాప్ వంటివని అన్నారు.

    ప్రపంచ జీడీపీ దృక్పథం.. జనాభా కేంద్రంగా మారిందని, ఈ పరివర్తనలో భారతదేశం పాత్ర చాలా కీలకమని ప్రధాన మంత్రి మోదీ అన్నారు.

    మోదీ

    భార‌త‌దేశంపై ప్ర‌పంచం దృక్ప‌థం మారుతోంది: మోదీ

    భార‌త‌దేశంపై ప్ర‌పంచం దృక్ప‌థం మారుతోందన్నారు. చాలా కాలంగా భారత్‌ వంద‌కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్న దేశంగా కనిపించందని, ఇప్పుడు ఆ దృక్ప‌థం మారిందన్నారు.

    ప్రస్తుతం భారత్ అంటే, ఒక బిలియ‌న్ ఆశయాలతో కూడిన మనస్సులు, నైపుణ్యం కలిగిన రెండు బిలియన్ల చేతులని ఆయన మోదీ అన్నారు.

    రాబోయే 1,000 సంవత్సరాలకు గుర్తుండిపోయే వృద్ధికి పునాది వేయడానికి ఇప్పుడు భారతీయులకు గొప్ప అవకాశం ఉందని మోదీ అన్నారు.

    ఒకప్పుడు కేవలం పెద్ద మార్కెట్‌గా భావించిన భారతదేశం.. ఇప్పుడు ప్రపంచ సవాళ్లకు పరిష్కారాల్లో అగ్రభాగాన నిలుస్తుందన్నారు.

    మోదీ

    'సబ్కా సాత్, సబ్కా వికాస్' ప్రపంచానికి మార్గదర్శక సూత్రం కావొచ్చు: మోదీ 

    జీ20 ప్రెసిడెన్సీ వల్ల భారతదేశం తృతీయ ప్రపంచం అని పిలవబడే దేశాల్లో విశ్వాస బీజాలను నాటిందని ప్రధాని మోదీ అన్నారు. 'సబ్కా సాత్, సబ్కా వికాస్' ప్రపంచ సంక్షేమానికి మార్గదర్శక సూత్రం కూడా కావచ్చని మోదీ అభిప్రాయపడ్డారు.

    సమీప భవిష్యత్తులోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుందని స్పష్టం చేశారు.

    దేశంలో 9సంవత్సరాల రాజకీయ స్థిరత్వం వల్లే దేశంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చినట్లు మోదీ చెప్పారు.

    బాధ్యతా రహితమైన ఆర్థిక విధానాలు, పాపులిజం స్వల్పకాలిక రాజకీయ ఫలితాలను ఇవ్వవచ్చు కానీ దీర్ఘకాలంలో ప్రతికూల ఫలితాలను ఇస్తాయన్నారు.

    మోదీ

    ప్రపంచ శాంతికి భారత్ కృషి: మోదీ

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తీసుకున్న వైఖరిపై కూడా మోదీ మాట్లాడారు. వివాదాలను పరిష్కరించడానికి దౌత్యం మాత్రమే సరైన మార్గమని ప్రధాని పునరుద్ఘాటించారు.

    జీ20 అధ్యక్షుడిగా ఉన్నా లేకున్నా ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి భారత్ మద్దతుగా ఉంటామన్నారు.

    వాతావరణ మార్పులపై మాట్లాడిన మోదీ, ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు మరింత చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.

    వాతావరణ మార్పులతో పోరాడడంలో అన్ని దేశాలకు సరిపోయే పరిష్కారాలు లేవన్నారు. సాంకేతికత ప్రజాస్వామ్యీకరణకు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. సాంకేతికతతో తమ విధానాలు పెద్ద ప్రపంచ ఉద్యమానికి సోపానాలన్నారు.

    మోదీ

    ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు అవసరం: మోదీ

    ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలపై ప్రధాని మోదీ కూడా మోదీ స్పందించారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల కోసం మోదీ పిలుపునిచ్చారు.

    20వ శతాబ్దం విధానాలు 21వ శతాబ్దంలో ప్రపంచానికి సేవ చేయలేవని వివరించారు. అంతర్జాతీయ సంస్థలు మారుతున్న వాస్తవాలను గుర్తించాలన్నారు.

    అలాగే వాటి ప్రాధాన్యతలను పునఃపరిశీలించాలన్నారు. దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు.

    అంతర్జాతీయ సంస్థలు కాలంతో పాటు మారకపోతే చిన్నపాటి ప్రాంతీయ ఫోరమ్‌లు కీలకకమైనవి మారే అవకాశం ఉందని మోదీ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    జీ20 సదస్సు
    తాజా వార్తలు

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    నరేంద్ర మోదీ

    నేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. పార్లమెంటులో అవిశ్వాసంపై మూడో రోజు చర్చ అవిశ్వాస తీర్మానం
    కాంగ్రెస్ వ్యాఖ్యలపై దుమారం.. ప్రధానిని సభకు రప్పించింది మేం కాదు, అవిశ్వాస తీర్మాన శక్తి  కాంగ్రెస్
    విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని కీలకాంశాలు ఇవే..! మణిపూర్
    రాహుల్ గాంధీపై బీజేపీ పాట.. ప్రేమ మనసులో ఉంటుంది, దుకాణాల్లో కాదు రాహుల్ గాంధీ

    ప్రధాన మంత్రి

    నేడు యూపీలో మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా నరేంద్ర మోదీ
    కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు.. ప్రధానిని దూషించడం రాజద్రోహం కాదు కర్ణాటక
    ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    నేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ

    జీ20 సదస్సు

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  జీ20 సమావేశం
    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం  జీ20 సమావేశం
    వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం చైనా

    తాజా వార్తలు

    యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య.. విమానాలు ఆలస్యం  బ్రిటన్
    రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా; డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ నియామకం  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
    పాకిస్థాన్‌లో భారత డిప్యూటీ హైకమిషన్‌గా గీతిక శ్రీవాస్తవ నియామకం  పాకిస్థాన్
    నేటి నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు; రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారి భేటీ  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025