NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ 
    తదుపరి వార్తా కథనం
    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ 
    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత క్టటుదిట్టం.. భారీగా బలగాల మోపరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ 

    వ్రాసిన వారు Stalin
    Aug 29, 2023
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.

    భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తున్న నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ఇప్పటికే వైమానిక దళం, పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను దిల్లీ అంతటా మోహరించారు.

    సెప్టెంబరు 9,10 తేదీల్లో దిల్లీలో జీ20 సమావేశాలు జరగనున్నాయి.

    ఈ క్రమంలో ఇప్పటికే భద్రతాపరమైన అంశాలను ఖరారు చేసేందుకు కేంద్ర సెక్యూరిటీ వింగ్ దిల్లీ పోలీసులతో సమావేశమైంది.

    దేశవిదేశాల నుంచి వచ్చే దేశాధినేతల వీఐపీ భద్రత కోసం సీఆర్పీఎఫ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.

    అలాగే ఎన్ఎస్‌జీ యూనిట్‌లోని యాంటీ టెర్రర్, యాంటీ-స్బోటేజ్, యాంటీ డ్రోన్ విభాగాలను కూడా అప్రమత్తం చేశారు.

    దిల్లీ

    జీ20 వేదిక వద్ద జామర్ల ఏర్పాటు 

    యాంటీ టెర్రర్ కార్యకలాపాలపై నిఘా పెట్టే బాధ్యతను ఎన్‌ఎస్‌జీకి అప్పగించారు.

    బాంబ్ డిస్పోజల్, యాంటీ డ్రోన్, యాంటీ బయోలాజికల్, కెమికల్ వెపన్ యూనిట్లను భారత ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా ఉంచింది. జామింగ్ పరికరాలతో కూడిన యాంటీ డ్రోన్ యూనిట్లను జీ20 వేదిక వద్ద ఇప్పటికే మోహరించారు.

    కేంద్ర ప్రభుత్వానికి దేశాధ్యక్షులు బస చేసే హోటళ్లకు భద్రత కల్పించడం సవాల్‌గా మారిందనే చెప్పాలి.

    అమెరికా అధ్యక్షుడు ఐటీసీ మౌర్యలో, చైనా అధ్యక్షుడు తాజ్ ప్యాలెస్‌లో, బ్రిటన్ ప్రధాని షాంగ్రి-లాలో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ది ఒబెరాయ్‌లో బస చేస్తారని తెలుస్తోంది.

    ఇంపీరియల్, లీలా ప్యాలెస్, తాజ్ మాన్‌సింగ్, ది లలిత్, ది క్లారిడ్జ్‌లు న్యూఢిల్లీ ప్రాంతంలోని కొన్ని ఇతర హోటళ్లలో ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

    దిల్లీ

    వీఐపీలో బస చేసే హోటళ్లలో భద్రతాపరమైన సవాళ్లు 

    వీఐపీలో బస చేసే హోటళ్లలో భద్రతా పరమైన సవాళ్లు ఎదురవుతున్నట్లు సెక్యూరిటీ గ్రిడ్ ఆఫీసర్ తెలిపారు.

    వీఐపీ బస చేసే అంతస్తులోకి వెళ్లే వారికి ప్రత్యేకంగా యాక్సెస్ కార్డ్‌లను జారీ చేసినప్పటికీ ఈ జాగ్రత్తలు సరిపోవని తెలుస్తోంది.

    అత్యవసర పరిస్థితుల్లో హోటళ్ల పై కప్పులపై హెలికాప్టర్ ల్యాండింగ్ అంశం చాలా ఇబ్బందికరంగా మారింది.

    చాలా హోటళ్లు చాపర్లు లాండ్ అవడానికి అనుకూలంగా లేవు. హోటల్ పైకప్పులు చిన్నగా ఉండటం, కొన్నింటి పై కప్పులపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం వంటి సమస్యలు ఉన్నాయి.

    అత్యవసర పరిస్థితుల్లో కమాండోలను హోటల్ భవనాలపై దింపవలసి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దానిపై ఐఏఎఫ్, ఎన్ఎస్‌జీ ఆధ్వర్యంలో రెండు రోజుల్లో నియమించబడిన డ్రిల్స్ నిర్వహించనున్నారు.

    దిల్లీ

    1,000 మంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన కమాండోలు

    జీ20 సదస్సు కోసం కేంద్రం ప్రత్యేకంగా శిక్షణ పొందిన 1000మంది కమాండోలను సిద్ధం చేసింది.

    రెండు నెలలుగా నోయిడాలోని ఫోర్స్ అకాడమీలో వీరు వీఐపీ భద్రత కోసం ప్రత్యేక శిక్షణ పొందారు. శిక్షణ కోసం ఎంపిక చేయబడిన సిబ్బందికి ముందుగా ఎస్‌పీజీ, ఎన్ఎస్‌జీలో పనిచేసిన అనుభవం కూడా ఉంది.

    దిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జీ20 వేదిక, హోటళ్ల వద్ద ప్రముఖులకు భద్రత కల్పిస్తారు. ప్రముఖులను తీసుకెళ్లే డ్రైవర్లందరూ సీఆర్పీఎఫ్ నుంచే ఉంటారు.

    ప్రముఖులను తీసుకెళ్లేందుకు పలు బ్యాకప్ వాహనాలను కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. దాదాపు 4000మంది దిల్లీ పోలీసులు ఈ భద్రతలో భాగం అవుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సమావేశం
    దిల్లీ
    కేంద్ర ప్రభుత్వం
    భారతదేశం

    తాజా

    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  తాజా వార్తలు
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  తాజా వార్తలు
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  తాజా వార్తలు

    దిల్లీ

    'ఇండియా' కూటమిపై మోదీ ధ్వజం.. మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా నరేంద్ర మోదీ
    ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం  హోంశాఖ మంత్రి
    మరోసారి దిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. నోయిడాలో వరద నీటిలో తేలియాడుతున్న వాహనాలు భారీ వర్షాలు
    అశ్లీల వీడియో కాల్ చేసి కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా.. ఇద్దరి అరెస్ట్ కేంద్రమంత్రి

    కేంద్ర ప్రభుత్వం

    RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్  ఆర్ బి ఐ
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్
    Dearness Allowance: డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచే యోచనలో కేంద్రం  ఉద్యోగులు
    డిజిటల్ మోసాలపై కేంద్రం సీరియస్.. ఓటీటీలు జర భద్రం, బెట్టింగ్ ప్రకటనలపై నిఘా ఓటిటి

    భారతదేశం

    రాగల 5 రోజుల్లో దేశవ్యాప్తంగా మరో కుంభవృష్టి.. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఐఎండీ
    ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు నుండే ప్రారంభం  వ్యాపారం
    గోల్డ్ మెడల్ గెలిచిన భారత జట్టు.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కైవసం టీమిండియా
    Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం స్నేహితుల దినోత్సవం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025