
దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు
ఈ వార్తాకథనం ఏంటి
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆదివారం ఉదయం దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
రిషి సునక్ దంపతులు ఆలయంలో సుమారు గంటపాటు గడిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రిషి సునక్ పూజల గురించి అక్షరధామ్ ఆలయ డైరెక్టర్ జ్యోతీంద్ర దవే స్పందించారు. ఆయన్ను కలిసిన తర్వాత సనాతన సంస్థతో చాలా సన్నిహితంగా మెలిగినట్లు తమకు అనిపించిందని వెల్లడించారు.
రిషి సునక్ శుక్రవారం దిల్లీకి చేరుకొగా, ఆ తర్వాత వెంటనే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా హిందువుగా తాను గర్వపడుతున్నానని చెప్పారు. దిల్లీలోని ఆలయాన్ని సందర్శిస్తానని ఆరోజు చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అక్షరధామ్ ఆలయంలో రిషి సునక్ దంపతులు
G 20 in India | United Kingdom Prime Minister Rishi Sunak and his wife Akshata Murthy at Delhi's Akshardham temple.
— ANI (@ANI) September 10, 2023
(Source: Swaminarayan Akshardham's Twitter) pic.twitter.com/I8dwecv7pk