NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది? 
    తదుపరి వార్తా కథనం
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది? 
    'జీ20' అంటే ఏమిటి? కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?

    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది? 

    వ్రాసిన వారు Stalin
    Aug 30, 2023
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరగనున్న జీ20 సదస్సుకు కేవలం 9రోజుల సమయం మాత్రమే ఉంది.

    దిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్ఠాత్మంగా జీ20 సదస్సును నిర్వహించేందుకు భారత్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

    అసలు 'జీ20' అంటే ఏమిటి? కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

    సెప్టెంబరు 9,10 తేదీల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది.

    స్వాతంత్య్ర భారత చరిత్రలో మన దేశం ఆతిథ్యమిస్తున్న అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సదస్సు ఇదే కానుంది.

    గ్లోబల్ జీడీపీలో 85శాతం, వాణిజ్యంలో 75 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న జీ20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించడం అనేది అంతర్జాతీయంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి.

    జీ20

    జీ20 కూటమి నేపథ్యం

    అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం 1999లో జీ20 కూటమిని ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రపంచ ఆర్థిక సమస్యలపై చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను చూపడం ఈ కూటమి బాధ్యత.

    అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. స్పెయిన్ శాశ్వత అతిథిగా ఉంది.

    1999లో ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థల్లో నేలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌లతో కలిపి జీ20 కూటమిని ఏర్పాటు చేశారు.

    2007లో ఈ కూటమిలో దేశాధినేతలు, ప్రభుత్వాలను కూడా చేర్చుతూ అప్‌గ్రేడ్ చేసారు.

    జీ20

    జీ20 సదస్సులో భారత్ ఎజెండా ఇదే.. 

    జీ20 కూటమి పట్ల ప్రపంచ సమస్యలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

    వాతావరణ మార్పు, ఉగ్రవాదం, మహమ్మారి సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడం వల్లే పరిష్కరించుకోవచ్చని, ఒకదేశంతో మరొకదేశం పోరాడటం వల్ల అది జరగదన్నారు.

    భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు మానవతా సంక్షోభాలకు దారితీయకుండా ఉండటానికి, ఆహారం, ఎరువులు, వైద్య ఉత్పత్తుల సరఫరాను రాజకీయరహితం చేయాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు.

    ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు.

    జీ20

    భారత్ 'రూల్-టేకర్' నుంచి 'రూల్ మేకర్‌'గా మారడానికి మంచి తరుణం

    2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు జీ20 సదస్సును దిల్లీలో నిర్వహించడం వల్ల ప్రపంచ నాయకుడిగా మోదీ ఇమేజ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సహా జీ20 దేశాధినేతలతో మోదీ చాలా సాన్నిహిత్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

    ఇక దేశం విషయానికి వస్తే.. భారతదేశం 'రూల్-టేకర్' నుంచి 'రూల్ మేకర్‌'గా మారడానికి ఇదే మంచి తరుణం అనుకోవచ్చు.

    ప్రపంచ వ్యవహారాల్లో తన పాత్రను ప్రదర్శించడానికి భారతదేశానికి జీ20 శిఖరాగ్ర సమావేశం ఒక అవకాశం అనే చెప్పాలి.

    ఇప్పటికే చంద్రయాన్-3 విజయవంతం ద్వారా ప్రపంచ దృష్టిని భారత్ ఆకర్షించగలిగింది.

    త్వరలో నిర్వహించనున్న జీ20 సదస్సు ప్రపంచ యవనికపై భారత్ శక్తిగా ఎదగడానికి దోహదపడొచ్చు.

    జీ20

    వచ్చే ఏడాది జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలు బ్రెజిల్‌కు..

    జీ20 కూటమికి శాశ్వత అధ్యక్షుడు లేరు. ప్రతి సంవత్సరం, రొటేషన్ విధానం ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

    కరోనా మహమ్మారి తర్వాత నెలకొన్న భౌగోళిక రాజకీయ గందరగోళం, ఆర్థిక అనిశ్చితి సమయంలో ఇండోనేషియా నుంచి 2022 డిసెంబర్ 1న భారత్ జీ20 దేశాల కూటమి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది.

    వచ్చే ఏడాది బ్రెజిల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుంది. 2025లో 2025లో దక్షిణాఫ్రికా జీ20 ప్రెసిడెన్సీగా ఉండనుంది.

    అయితే మూడు అభివృద్ధి చెందుతున్న దేశాలు వరుసగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

    జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జీ20 ఆర్థిక మంత్రుల తొలి సమావేశం జరిగింది.

    దేశాధినేతలతో మొదటి జీ20 సమ్మిట్ 2008లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సదస్సు
    జీ20 సమావేశం
    దిల్లీ
    భారతదేశం

    తాజా

    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్

    జీ20 సదస్సు

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  భారతదేశం
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  శ్రీనగర్
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  పర్యటక శాఖ మంత్రి

    దిల్లీ

    మరోసారి దిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. నోయిడాలో వరద నీటిలో తేలియాడుతున్న వాహనాలు భారీ వర్షాలు
    అశ్లీల వీడియో కాల్ చేసి కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా.. ఇద్దరి అరెస్ట్ కేంద్రమంత్రి
    భారత వాతావరణ అంచనా వ్యవస్థలు ప్రపంచంలోనే భేష్  : కిరణ్ రిజిజు కేంద్ర ప్రభుత్వం
    దిల్లీల్లో మరికొన్ని రోజులు వర్షాలు; మళ్లీ ప్రమాద స్థాయికి యమునా నది భారీ వర్షాలు

    భారతదేశం

    ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు నుండే ప్రారంభం  వ్యాపారం
    గోల్డ్ మెడల్ గెలిచిన భారత జట్టు.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కైవసం టీమిండియా
    Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం స్నేహితుల దినోత్సవం
    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025