NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం 
    ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం

    ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం 

    వ్రాసిన వారు Stalin
    Sep 05, 2023
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జీ20 సదస్సు వేళ.. 'భారత్, ద మదర్ ఆఫ్ డెమెక్రసీ', 'ఎలక్షన్స్ ఇన్ ఇండియా' పేరుతో రెండు బుక్‌లెట్స్‌ను కేంద్రం విడుదల చేసింది.

    ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటి అనే అంశాన్ని మరింత బలపర్చేందుకు 6,000ఏళ్ల ప్రజాస్వామ్య భారతీయ చరిత్రను ఈ బుక్‌లెట్స్‌లో కేంద్రం పొందుపర్చింది. ఈ బుక్‌లెట్స్‌ను జీ20 అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.

    ప్రజాస్వామ్య తత్వం సహస్రాబ్దాలుగా దేశంలో భాగంగా ఉందని ఆ బుక్‌లెట్స్ చెబుతున్నాయి.

    రాముడు, ఛత్రపతి శివాజీ, అశోక చక్రవర్తి, మొఘల్ చక్రవర్తి అక్బర్ ఏలుబడిని ప్రజాస్వామ్య పాలనగా ఆ బుక్‌లెట్‌లో పేర్కొన్నారు.

    మొఘలుల పాలనను తరుచూ వ్యతిరేకించే బీజేపీ అక్బర్‌ పరిపాలనను ప్రజాస్వామ్యమైనదంటూ కీర్తించడం ఆసక్తికరంగా ఉంది.

     జీ20

    అక్బర్‌ అవగాహన కలిగిన చక్రవర్తి

    రెండు బుక్‌లెట్లలోని 40 పేజీల్లో రామాయణం, మహాభారతం, ఛత్రపరి శివాజీ, అక్బర్, సార్వత్రిక ఎన్నికల ద్వారా భారతదేశం అధికార మార్పిడి అంశాల గురించి కేంద్రం చెప్పుకొచ్చింది.

    అక్బర్‌ను అవగాహన కలిగిన చక్రవర్తిగా బుక్‌లెట్‌లో కేంద్రం పేర్కొనడం గమనార్హం.

    అక్బర్ మత వివక్షకు వ్యతిరేకంగా 'సుల్-ఇ-కుల్' అనే సార్వత్రిక శాంతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్రం చెప్పింది.

    దిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి దేశాధినేతలు రానున్నారు.

    ఈ రెండు బుక్‌లెట్‌లను జీ20 సమావేశాలకు వచ్చే ప్రముఖులకు అందజేయనున్నారు.

    జీ20

    ప్రజలు ఎన్నుకున్న మొదటి పాలకుడు రాముడు

    రామాయణం, మహాభారతాల కాలంలో కూడా ప్రజాస్వామ్య అంశాలను ఈ బుక్‌లెట్ ఉదహరించింది.

    'ప్రాచీన అయోధ్య రాజ్యానికి కొత్త రాజు అవసరమైనప్పుడు, దశరథుడు తన మంత్రిమండలి, ప్రజాప్రతినిధుల ఆమోదం కోరారు.

    ప్రజాప్రతినిధులు సమాజంలోని అన్ని వర్గాలతో సమగ్ర సంప్రదింపులు జరపగా అందరూ రాముడిని ఏకగ్రీవంగా రాజుగా అంగీకరించారు.

    దీంతో దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన మొదటి పాలకుడు రాముడు' అంటూ కేంద్రం రూపొందంచిన బుక్‌లెట్ చెబుతోంది.

    మహాభారతంలో భీష్ముడు తన మనవడు యుధిష్ఠిరునికి సుపరిపాలన సూత్రాలను చెప్పాడని పేర్కొంది.

    పాలకుడు ఎలా ఉండాలి అనేది వందల ఏళ్ల క్రితమే భీష్ముడు చెప్పాడని ఆ బుక్‌లెట్‌లో పొందుపర్చారు.

    జీ20

    అశోకుడి కాలంలోనే ఐదేళ్లకు ఒకసారి మంత్రులను ఎన్నుకునే పద్ధతి

    265-238 BCEలోనే అశోక చక్రవర్తి ప్రతి ఐదేళ్లకు ఒకసారి మంత్రులను ఎనుకునే పద్ధతిని ప్రవేశపెట్టిన బుక్‌లెట్లు వర్ణించాయి.

    శాంతి, సంక్షేమం, సార్వత్రిక సౌభ్రాతృత్వం అనే అశోకుడి సిద్ధాంతాలు నేటికీ భారత ఉపఖండం అంతటా శాసనాల రూపంలో భద్రపర్చినట్లు బుక్‌లెట్ ద్వారా కేంద్రం స్పష్టం చేసింది.

    ఛత్రపతి శివాజీ పాలనా దక్షకుడని, ఆయన పాలనలో ప్రజలు సమాన హక్కులను అనుభవించేవారని బుక్‌లెట్ల ద్వారా కేంద్రం చెప్పుకొచ్చింది.

    అధికార వికేంద్రీకరణ పద్ధతిని ఆనాడే శివాజీ ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. తన పాలనకు ప్రాతినిధ్యం వహించే ఎనిమిది మంది మంత్రులను శివాజీ ఎలా నియమించాడో ఈ బుక్‌లెట్ వివరిస్తుంది.

    మంత్రుల సలహాలను రాజు కూడా తోసిపుచ్చలేని పరిస్థితి ఆనాడు ఉండేదని చెప్పుకొచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సదస్సు
    భారతదేశం
    శ్రీరాముడు
    బీజేపీ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    జీ20 సదస్సు

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  ప్రధాన మంత్రి
    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం  జీ20 సమావేశం
    వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం చైనా

    భారతదేశం

    CR Rao: తెలుగు మూలాలున్న ప్రపంచ గణిత మేథావి సీఆర్ రావు మృతి  కర్ణాటక
    చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ప్రపంచ దేశాల ఫోకస్.. ఇంతకీ అక్కడ ఏముందో తెలుసా చంద్రయాన్-3
    Chandrayaan 3 mission successful: సాహో ఇస్రో.. జయహో భారత్.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం చంద్రయాన్-3
    అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు చంద్రయాన్-3

    శ్రీరాముడు

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కెనడా
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల అయోధ్య

    బీజేపీ

    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్
    బీజేపీ,ఆర్ఎస్ఎస్‭లకు అధికారం మాత్రమే కావాలి.. దాని కోసం మణిపూర్‭ను తగలబెడతారు : రాహుల్  రాహుల్ గాంధీ
    మహిళలను గౌరవించకపోతే దేశం పురోగమించదు.. బీజేపీ అధికార దాహంతో ఆటలాడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025