NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు? 
    తదుపరి వార్తా కథనం
    జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు? 
    జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు?

    జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు? 

    వ్రాసిన వారు Stalin
    Sep 14, 2023
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగులపై మరో అప్టేట్ వచ్చింది.

    చైనా ప్రతినిధులు వద్ద అనుమాస్పదంగా కనిపించిన బ్యాగులు రెండు కాదని, 20 అని టైమ్స్ అఫ్ ఇండియా నివేదిక చెబుతోంది. అందులో నిఘా పరికరాలు ఉండొచ్చని ఇంటలీజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

    దిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేసిన ఆరుగురు చైనా అధికారుల బృందం ఆ రహస్యమైన బ్యాగ్‌లను తీసుకొచ్చింది.

    ఆ బ్యాగులు చూడటానికి చాలా పెద్దవిగా ఉన్నాయని, 1x1 మీటర్ పొడవు, వెడల్పుతో పాటు 10 అంగుళాల మందం ఉన్నాయని నివేదిక చెప్పింది.

    చైనా

    బ్యాగుల కూపీలాగే పనిలోని నిఘా వర్గాలు

    ఆ బ్యాగులను తనిఖీ చేయడానికి చైనా బృందం నిరాకరించింది. దీంతో బ్యాగుల్లో ఏముందో తనిఖీ చేయనివ్వకుండా చైనా ప్రతినిధులు వాటిని చైనా రాయబార కార్యాలయానికి తరలించారు.

    దీంతో ఆ బ్యాగ్‌లలో ఏమి దాచిపెట్టారో మిస్టరీగానే మారింది.

    భారత ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం ఆ బ్యాగుల కూపీ లాగే పనిలో నిమగ్నమయ్యారు.

    అందులో నిఘా పరికరాలు ఉన్నాయా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ బ్యాగుల వ్యవహారంపై మాత్రం చైనా మౌనం వహిస్తోంది.

    బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా నేతృత్వంలోని జీ20 ప్రతినిధి బృందం కూడా చైనా ప్రతినిధులు బస చేసిన తాజ్ ప్యాలెస్ హోటల్‌లోనే బస చేశారు.

    దీంతో వారి బ్యాగుల్లో చైనా ఏమైనా నిఘా పరికరాలను పెట్టిందా? అనే కోణంలో విచారిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    భారతదేశం
    జీ20 సదస్సు

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    చైనా

    కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక  నరేంద్ర మోదీ
    China: కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి పాఠశాల
    దిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు దిల్లీ
    ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?  రక్షణ

    భారతదేశం

    వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం చైనా
    ఇండియాకు అమెరికా గుడ్ న్యూస్.. భారత్‌లో జీఈ విమాన ఇంజిన్ల తయారీకి యూఎస్ కాంగ్రెస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ భారతదేశం
    అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే నిజాలు.. దిల్లీలో మాయ గ్యాంగ్ అలజడులు హత్య
    జయహో భారత్.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానం ఆర్థిక సంవత్సరం

    జీ20 సదస్సు

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  జీ20 సమావేశం
    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం  జీ20 సమావేశం
    G-20 SUMMIT- 2023: నాల్గోసారి భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025