
Mangli Drug Case: డ్రగ్స్ వాడితే ఎంతటి ప్రముఖులైనా,చర్యలు తప్పవు: తెలంగాణ పోలీస్
ఈ వార్తాకథనం ఏంటి
చట్టాలను పక్కనపెట్టి, ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరిస్తే తెలంగాణ పోలీసులు నిశ్శబ్దంగా ఉండబోమని స్పష్టంగా హెచ్చరించారు.
అవసరమైతే లాఠీ ఝళిపించి, పరిస్థితిని గాడిలో పెట్టాల్సి వస్తుందని తెలిపారు. ఎంతటి ప్రముఖులైనా సరే, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను వినియోగిస్తే గట్టిగా ఎదుర్కొంటామని పోలీసు శాఖ తమ అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా స్పష్టం చేసింది.
మంగళవారం రాత్రి చెవెళ్లలోని ఓ రిసార్టులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న సమాచారంతో అక్కడికి చేరుకున్న చెవెళ్ల పోలీసులు, దాడికి సంబంధించిన ఫొటోలు కూడా పంచుకున్నారు.
వివరాలు
పోలీసులు కేసులు నమోదు
సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం,గంజాయి లభ్యమయ్యాయి.
రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలంలోని ఈర్లపల్లి శివారులో ఉన్న ఓ రిసార్టులో మంగళవారం రాత్రి మంగ్లీ తన స్నేహితులకు పుట్టినరోజు పార్టీ ఇచ్చారు.
ఈ పార్టీకి దాదాపు 50 మంది వరకు హాజరయ్యారు. వీరిలో మంగ్లీ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు సమాచారం.
రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఎస్వోటీ పోలీసులు రిసార్టుపై ఆకస్మికంగా దాడి చేశారు.
దీనితో పాటుగా, మంగ్లీతో పాటు పార్టీ నిర్వాహకుడు, రిసార్ట్ నిర్వాహకుడు, అలాగే డ్రగ్స్ టెస్టులో గంజాయి వాడకం పాజిటివ్గా తేలిన వ్యక్తిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ పోలీసులు చేసిన ట్వీట్
అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై దాడిచేసిన చేవెళ్ల పోలీసులు. చట్టాలు పాటించకుండా ఎలాపడితేఅలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుంది. ఎంతటిప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారిపట్ల కఠినచర్యలు తీసుకోవడానికి వెనుకాడం. #TelanganaPolice pic.twitter.com/s4IbSzhIkM
— Telangana Police (@TelanganaCOPs) June 11, 2025