Page Loader
Rameshwaram blast: రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య 
Rameshwaram blast: రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య

Rameshwaram blast: రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య 

వ్రాసిన వారు Stalin
Mar 01, 2024
07:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

Rameshwaram Cafe blast: బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 9 మంది గాయపడ్డారు. బాంబు పేలుడు కారణంగా పేలుడు సంభవించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధృవీకరించారు. కేఫ్‌లో ఓ వ్యక్తి బ్యాగ్‌ పెట్టుకుని కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి బ్యాగును తీసుకెళ్లడం కనిపించిందని, ప్రాథమిక విచారణలో అందులో ఐఈడీ ఉన్నట్లు తేలిందని సిద్ధరామయ్య తెలిపారు. హోంమంత్రి, సీనియర్ పోలీసు అధికారులతో మాట్లాడానని, ఓ గుర్తుతెలియని వ్యక్తి బ్యాగ్‌తో రెస్టారెంట్‌కి వచ్చాడని చెప్పారు. టోకెన్ కొని భోజనం చేశాడని, అనంతరం బాంబు ఉన్న బ్యాగ్‌ని వదిలేశాడని వివరించారు.

బాంబు పేలుడు

గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స 

పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఇది హై ఇంటెన్సిటీ పేలుడు కాదని, ఆకస్మిక పేలుడు అని ఆయన అన్నారు. హోటల్ సిబ్బందితో సహా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. తూర్పు బెంగళూరులోని కేఫ్‌లో మధ్యాహ్నం 1 గంట సమయంలో పేలుడు సంభవించినట్లు కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర తెలిపారు. కేఫ్‌లో ఎల్‌పీజీ లీకేజీ వల్ల మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖకు అందినట్లు కర్ణాటక రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం డైరెక్టర్ టీఎన్ శివశంకర్ పేర్కొన్నారు.