NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు

    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు

    వ్రాసిన వారు Stalin
    Feb 28, 2023
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మార్చి 2న దిల్లీలో జరిగే జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ హాజరుకానున్నారు. ఈ మేరకు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    జీ20 సమావేశంలో చైనా హాజరుపై ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై జీ20 దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆర్థిక వ్వవస్థపై ప్రపంచ దేశాలకు సానుకూల సంకేతాలు పంపేందుకు ఇతర దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు మావో నింగ్ వివరించారు.

    జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరు కావాలని భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఇప్పటికే కిన్ గాంగ్‌కు ఆహ్వానం పంపారు.

    జీ20

    సమావేశాలకు జపాన్ దూరం

    తూర్పు లద్ధాఖ్‌లోని సరిహద్దు వద్ద చైనా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

    జూన్, 2020లో తూర్పు లద్ధాఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల పరిస్థితి ఉప్పూ-నిప్పూలా మారింది.

    అయితే సరిహద్దు వద్ద సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి, తీవ్రతను తగ్గించడానికి, ఇరు పక్షాలు దృష్టి సారించాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు.

    జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి జపాన్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఆ దేశ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మీటింగ్‌కు జపాన్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    భారతదేశం
    దిల్లీ
    సుబ్రమణ్యం జైశంకర్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    చైనా

    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్
    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు కోవిడ్
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్

    భారతదేశం

    అధికారిక లాంచ్‌కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ చిత్రాలు లీక్ ఆటో మొబైల్
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    Climate Risk: డేంజర్ జోన్‌లో ముంబయి; దేశంలోని 9రాష్ట్రాల్లో ప్రమాదకరంగా వాతావరణం చైనా
    కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల ఆటో మొబైల్

    దిల్లీ

    జేఎన్‌యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి నరేంద్ర మోదీ
    శ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు భారతదేశం
    ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను ప్రకటించిన కేంద్రం, ఏపీకి విశిష్ట సేవా పురస్కారాలు గణతంత్ర దినోత్సవం
    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం

    సుబ్రమణ్యం జైశంకర్

    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ పాకిస్థాన్
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ కాంగ్రెస్
    మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్ అదానీ గ్రూప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025