NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / The Wall Street Journal: చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక
    The Wall Street Journal: చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక
    అంతర్జాతీయం

    The Wall Street Journal: చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక

    వ్రాసిన వారు Naveen Stalin
    February 27, 2023 | 04:21 pm 1 నిమి చదవండి
    The Wall Street Journal: చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక
    చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక

    ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి చైనాలో జరిగిందని మరో పరిశోధన తేల్చి చెప్పింది. చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు రిపోర్డును 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించింది. చైనా ల్యాబ్ జరిగిన ప్రమాదం వల్లే కరోనా ఉద్భవించి ఉండవచ్చని ఈ మేరకు ఎనర్జీ డిపార్ట్‌మెంట్ అభిప్రాయానికి వచ్చింది. దీనికి సంబంధించి ఐదు పేజీల రిపోర్టును తయారు చేసింది. వాస్తవానికి గతంలో కూడా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ కరోనా పుట్టుక గురించి పరిశోధన చేసింది. కానీ నిర్దిష్టంగా అప్పుడు చెప్పలేకపోయింది. అయితే తాజాగా చేసిన పరిశోధన చాలా కచ్చితత్వంతో చేసి, వైట్ హౌస్‌కు నివేదికను సమర్పించింది.

    ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ అత్యున్నతస్థాయి నిపుణులు ఉండే ఏజెన్సీ

    ఎనర్జీ డిపార్ట్‌మెంట్ అనేది అమెరికాలో జాతీయ ప్రయోగశాలల నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తుంది. అధునాతన జీవ పరిశోధనలను కూడా అది పరిశీలిస్తోంది. ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నతస్థాయి నిపుణులు ఉంటారు. ఈ నేపథ్యంలో అంతటి ప్రాధాన్యం ఉన్న సంస్థ ఇచ్చిన రిపోర్టు కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకున్నది. 2021లో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కరోనా వైరస్ పుట్టుక చైనాలో జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. అది ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నది. ఇదిలా ఉంటే, మూడు సంవత్సరాల క్రితం ఉద్భవించిన కరోనా కారణంగా ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది అమెరికన్లు మరణించారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కోవిడ్
    చైనా
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    కోవిడ్

    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' మన్‌సుఖ్ మాండవీయ
    గురుగ్రామ్: కరోనాకు భయపడి మూడేళ్లుగా బయటికి రాకుండా ఇంట్లోనే తల్లీకొడుకులు హర్యానా
    చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే? చైనా
    భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    చైనా

    రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    వరుస భూకంపాలతో అల్లాడిపోయిన తజికిస్థాన్‌; విరిగిపడ్డ కొండచరియలు భూకంపం
    IMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం వ్యాపారం
    Climate Risk: డేంజర్ జోన్‌లో ముంబయి; దేశంలోని 9రాష్ట్రాల్లో ప్రమాదకరంగా వాతావరణం భారతదేశం

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం బి ఎం డబ్ల్యూ
    నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న స్పేస్‌ఎక్స్ నాసా
    2024 బి ఎం డబ్ల్యూ X5 v/s 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా బ్యాంక్
    తదుపరి వార్తా కథనం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023